పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తమ ఉనికిని చాటుకునేందుకు బీజేపి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ.. తమ చివరి నాలుగు దశలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వెలువరించగానే ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా అధిష్టాన నిర్ణయంపై పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని తమ భుజాలపై మోస్తూ వచ్చిన నేతలను కాదని.. రాష్ట్రంలోని అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలను ఎంచుకుని వారికి అసెంబ్లీ బరిలోకి దింపడాన్ని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో తమ నియోజకవర్గాలలో అభ్యర్థులను తక్షణం మార్చాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
అధికార తృణముల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన 22 మందికి టికెట్లు కేటాయించడాన్ని బీజేపి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తమ నిరసనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు విధ్వంసమార్గానే అన్వేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రధాన రహదారులపై టైర్లు కాల్చి నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల బీజేపీ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. మరీముఖ్యంగా మైదా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపి కార్యకర్తలు ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోంత పార్టీకి చెందిన కార్యకర్తలే పార్టీ కార్యాలయ సామాగ్రిని ధ్వంసం చేస్తూ రెచ్చిపోవడంతో.. కార్యాలయ సిబ్బంది నిశ్చేష్టులై చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
ఇక ఇలాంటి ఘటనలు మాల్డా, జల్పాయ్గురి, ఉత్తర, దక్షిణ పరగణాలు, డమ్డమ్, అసన్సోల్, హుగ్లీ, హౌరా, అలీపుర్దార్, కూచ్బెహర్ జిల్లాల్లోనూ చోటుచేసుకున్నాయి. వలస నాయకులను వద్దని.. స్వతహాగా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన నాయకులకే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం పార్టీ అధిష్టానం అభ్యర్థులను మార్చాలాని ఆందోళనకు దిగారు. దిగి రాకుంటే సొంతపార్టీ అభ్యర్థులను ఓడిస్తామని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోం నుంచి నేరుగా కోల్కతా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి సీనియర్ నేతల బృందాన్ని రప్పించి అసంతృప్తి రగులుకున్న ప్రాంతాలకు పంపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు నేతలను పిలిచి సమస్యపై చర్చించాలని, పరిస్థితిని అదుపు చేయాలని ఆదేశించారు.
#WATCH: BJP workers sloganeer and vandalise party office in Malda, demanding a candidate of their choice in the Assembly constituency, for #WestBengalElections2021 pic.twitter.com/58fFJxq55b
— ANI (@ANI) March 19, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more