దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ.. గత ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నాటి స్థాయికి చేరుకుంటున్న తరుణంలో కేంద్ర అప్రమత్తమై.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి దేశంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు చేసుకుంటున్న మహరాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ‘మహారాష్ట్ర’లో కరోనా విజృంభణపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో కరోనా టీకా కావాలన్న ప్రతీ ఒక్కరికి టీకాను కేంద్రం తక్షణం వేయించాలని సూచన చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో ఉద్దృతి కోనసాగకుండా అడ్డుకోవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరికీ టీకాలు ఇచ్చేలా అత్యవసర అనుమతలను తక్షణం కేంద్రం జారీ చేయాలని కేంద్రాన్ని సూచించారు. ‘‘దేశంలో నమోదవుతున్న రోజువారీ కొత్త కరోనా కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన రాష్ట్రాన్ని లాక్ డౌన్లు బలహీనపరిచే అవకాశముందని ఇది ప్రగతికి అవరోధం కలిగించే అవకాశం వుందని అన్నారు.
అంతేకాదు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. ఇక్కడ టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు ఇచ్చేలా అత్యవసర అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా విన్నవించారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పదాన కూడా శరవేగంగా సాగుతున్న ఈ క్రమంలో టీకాల కొరత కూడా ఉత్పన్నం కాదని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ను ఆయన ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. కేవలం వ్యాక్సినేషన్ పెంచితే సరిపోదని.. కరోనా పరీక్షలు, ట్రేసింగ్, చికిత్సలో వేగం పెంచాలని అన్నారు. దీంతో పాటు ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకుని క్రమశిక్షణగా ఉండటం ముఖ్యమని చెప్పారు.
నెటిజన్ ట్వీట్కు మహీంద్రా బదులిస్తూ.. ‘‘అవును నేనూ ఇందుకు ఒప్పుకుంటాను. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టకపోతే మనం రెండు, మూడు, నాలుగో దశ కరోనా వ్యాప్తితో బాధపడాల్సి వస్తుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నాగ్ పూర్, ఫూణే, హోలియా సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్, ఆంక్షలు కోనాసాగుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధలను పాటించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధించాల్సి వస్తోందని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more