అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా.? అమరావతి భూములనే టార్గెట్ చేసినా.. విజయవాడలోనూ ఇటీవల జరిగిన పంచాయతీ, పురసాలక సంఘాల ఎన్నికలలోనూ పార్టీని విజయ తీరాలను చేర్చలేపోయిన ఆయన పార్టీ కార్యకర్తలను కుంగుబాటుకు గురికావద్దని చెప్పి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టారు. అయినా.. మాజీ ముఖ్యమంత్రిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టార్గెట్ చేసి.. ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు సిద్దమయ్యారు.
ఈ క్రమంలో అమరావతి భూముల వ్యవహరాల్లో అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాల్సిందిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి నేరుగా రాష్ట్ర నేరపరిశోధనా విభాగం ఏపీ సిఐడీ అధికారులకు గత నెల ఫిబ్రవరిలో పిర్యాదు చేశారు. దీంతో పాటు పలు ఆధారాలు కూడా సమర్పించడంతో దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సిఐడీ డీఎస్సీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా అమరావతి అసైన్డ్ భూముల వ్యవహరంలో పలు సెక్షన్ల కింద సిఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను కూడా త్వరలో ప్రారంభించనున్నారు.
కేసుల విచారణలో భాగంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడికి సిఐడి అధికారులు ఇవాళ నోటసులు అందజేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానాకి వెళ్లిన సిఐడీ అధికారులు రాజధానిలోని అసైన్డ్ భూముల విషయంలో ఈ నెల 23ను తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కోన్నారు. ఈ మేరకు సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సిఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 23న విజయవాడలోని సిఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని పేర్కోన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పి.నారాయణకు కూడా నోటీసులు అందించామని అధికారులు తెలిపారు. కాగా ఈ కేసుల వ్యవహరాంలో భారత శిక్షాస్మృతి సెక్షన్ 120బి, సెక్షన్ 166, సెక్షన్ 167తో పాటు సెక్షన్ 217 కింద కేసును విచారిస్తున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more