సొంత పార్టీ నిర్ణయాలను కూడా తనదైన శైలిలో విమర్శించి.. తన వ్యతిరేకతను బాహాటంగానే వినిపించే బీజేపి సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలోనూ తనదైన వ్యతిరేకతను వినిపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదని అన్నారు. ప్రతి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని.. బలమైన కారణాలు ఉంటేనే అలా చేయాలని చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేయాలా? వద్దా? అనే విషయాన్ని కేస్ బై కేస్ చూడాలని అన్నారు.
ఓ కేసు విషయమై ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరుపతి సివిల్ కోర్టుకు హాజరై అక్కడ తన వ్యవహరాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత అమరావతికి చేరుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇవాళ తాడెపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురు నేతలు కొంతసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్వామిని జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనను శాలువాతో సత్కరించి, తిరుమల వేంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు. జగన్ తో భేటీ అనంతరం మీడియాతో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, టీటీడీ లావాదేవీలను కాగ్ తో ఆడిట్ చేయించేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని మోదీతో జగన్ చర్చలు జరుపుతారని భావిస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్షం, కార్మిక నేతలతో కలుస్తానని జగన్ చెప్పారని అన్నారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు. పెట్రో ధరల పెరుగుదల సామాన్యుల పాలిట పెను భారంగా పరిణమించిందని విమర్శించారు. టీటీడీని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలని... ప్రజలే దాన్ని నడిపించేలే చేయాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, చంద్రబాబు హయాంలో టీటీడీలో చాలా అవకతవకలు జరిగినట్టు స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more