ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ అర్థర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రైతులు విజయవాడ ఇంధ్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ దేవాలయం వద్దకు ర్యాలీగా చేరాలని ఇచ్చిన పిలుపును పోలీసులు అడ్డుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి ర్యాలీగా వెళ్తున్న మహిళలను పోలీసులు ప్రకాశం బ్యారేజీపై అడ్డుకుని నిర్భంధించారు. దీంతో బ్యారేజీపైనా బైఠాయించిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ నిర్ణయం తీసుకుని అమరావతి సీఆర్డీఏను రద్దు చేస్తారని ఊహాగానాలు వచ్చిన నాటి నుంచి అలాంటి చర్యలు చేపట్టవద్దని డిమాండ్ చేస్తూ తాము అందోళనలు చేస్తున్నామని వారు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం తమ దీక్షలు, నిరసనలను.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ మొర వినడం లేదని, తమను, తమ సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని అమరావతి రైతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావాతి ప్రాంత రైతులు, మహిళలు, విద్యార్థులు కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి ర్యాలీగా బయలుదేరారు.
వీరిని పోలీసులు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ‘సేవ్ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను ప్రకాశం భ్యారేజీ సీడ్ యాక్సిన్ రో్డ్డుపై నుంచి మంగళగిరి, తాడేపల్లి పోలిస్ స్టేషన్లకు తరలించారు. ఈ విషయం తెలిసిని అమరావతి ప్రాంత వాసులు రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయపూడి నుంచి మందడం వస్తున్న రైతుల్ని పోలీసులు వెలగపైడీ వద్ద అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి రాకపోకల్ని నిలివరించారు. మహిళలు కూడా రోడ్డుపై భైఠాయించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో మహిళలు ఉదయం నుంచి రోడ్డపైనే వుండటంతో అందోళనకారులు వారికి అల్పహారాన్ని అందించడం.. దానిని పోలీసులు అడ్డుకోవడంతో రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు క్రిమిసంహారక మందు డబ్బాలను చేతపట్టుకున్నారు. కొంతమంది మహఇళలు వెలగవూడి సచివాలయం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇక ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళలను తక్షణం విడుదల చేయాలని అప్పటి వరకు వెనక్కు తగ్గబోమని అమరావతి రైతులు రోడ్డపై బైఠాయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more