కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా సమయంలో చాలీ చాలని జీతాలు.. ఉపాధి కొల్పోవడంతో సినీ కార్మికులు మొదలుకుని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల వరకు అందరూ తమ కుటుంబపోషణ కోసం కూరగాయాలు, కిరాణా షాపులు, టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనాకు వాక్సీన్ డ్రైరన్ ముగిస ఇవాళ రేపట్లో హెల్త్ వర్కర్లకు అందజేస్తున్న సమయంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది.
రైల్వేలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని అది నిరంతరం కోనసాగుతోందని రైల్వే బోర్డు కొత్త సీఈవో సునీత్ శర్మ అన్నారు. రైల్వే కొత్త చైర్మన్ గా గత వారం రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇక రైల్వే సహా అన్ని ప్రభుత్వ సెక్టార్ల ఉద్యోగాలకు కరోనా వైరస్ ప్రభావితం చేసిందన్న ఆయన రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్లుగా ఎంపికైన వారిని త్వరలోనే ఉద్యోగాలలో నియామకాల పిలుపును అందుకుంటారని అన్నారు. వారందరికీ గత నెల నుంచే శిక్షణను కూడా ప్రారంభించామని సునీత్ శర్మ తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా శిక్షణ ఇవ్వడంలో జాప్యం జరిగిందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. డిసెంబర్ నుంచి రైల్వే బోర్డు పరిధిలోని అన్ని శిక్షణా కేంద్రాలలో శిక్షణ ప్రారంభమైందన్నారు. ఇక శాఖపరంగా ఎలాంటి ఖాళీలు వున్నా వాటిని వెంటనే భర్తి చేస్తామని కూడా చెప్పారు. ఇదిలా ఉంటే, గతేడాది లక్షా 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయగా, రెండు లక్షలకు మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కరోనా కారణంగా నిలిచిన పరీక్షలను డిసెంబర్ నుంచి నిర్వహిస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని సునీత్ శర్మ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more