ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్ పిటీషన్ వేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ఎదుట సవాలు చేసింది. దీనిపై ఓ వైపు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న తరుణంలోనే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగించే చర్యలకు పూనుకుంటున్న ఇంటి దోంగల భరతం కూడా పడుతోంది ఎన్నికల సంఘం. ఓ వైపు ఎస్ఈసీ నిర్ణయంపై న్యాయస్థానం వ్యతిరేక తీర్పును వెలువరించడంతో దానిని సవాల్ చేసిన ఈసీ.. ఇక తమ శాఖలోనే ఎన్నికల వేళ అందుకు సుముఖంగా లేని అధికారులపై కోరడా ఝుళిపించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్నారు. ఇక తమ విభాగంలో వున్న సిబ్బందిని ప్రక్షాళణ చేసే ప్రక్రియను కూడా చేపట్టారు, ఇక తాజాగా కార్యదర్శి వాణి మోఁహన్ సేవలకు కూడా చెక్ పెట్టారు, రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్డు విడుదల చేసిన తరుణంలో ఆయన 30 రోజుల పాటు సెలవుపై వెళ్లడంతో రాష్ట్ర ఎన్నికల అధికార నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మండిపడుతున్నారు. దీంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. తన అధికారాలకు మరింత పదును పెట్టిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వరుసగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు.
జీవీ సాయి ప్రసాద్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న ఆయన.. సాయిప్రసాద్ తాను సెలవుపై వెళ్లడంతో పాటు ఇతర ఎన్నికల సంఘం ఉద్యోగులు, సిబ్బందిని కూడా సెలవులపై వెళ్లేలా ప్రభావితం చేశారన్న అధారాలు ఉన్నయాని దీంతో అయనపై క్రమశిక్షణా చర్యలకు ఈ అభియోగాలను కూడా జతపర్చుతున్నట్లు తెలిపారు. దీంతో ఆయనను ఎన్నికల విధుల నుంచి తొలగించింది. అంతటితో ఆగకుండా ఆయన ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక తాజాగా సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్ను తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్కు లేఖ రాశారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషన్లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more