ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ సంచలన అదేశాలను వెలువరించింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులో సంబంధిత ఐఏఎస్ అధికారిపై ఏపీ రాష్ట్రోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. రెక్యూసల్ పిటీషన్ పై తీర్పును వెలువరిస్తూ.. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ సమర్పించిన మిషన్ బిల్డప్ ఏపీ బాధ్యతలను నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లో తప్పుడు సమాచారం ఎందుకు అందించారోనన్న వివరాలను కూడా తెలపాలని అదేశించింది.
కోర్టు ధిక్కారం కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రార్ జనరల్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేసింది. న్యాయవ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం కల్పించుకోవడం మూలంగానే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ఈ కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన పలు పిటీషన్లను న్యాయస్థానం కోట్టివేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఇక మరో కేసులో రాష్ట్ర ఉన్నత అధికారులకు కూడా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలో జరిగిన శాఖపరమైన పదోన్నత విషయంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ రామారావు దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో హోం కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీజీపి గౌతమ్ సవాంగ్, ఐజీ మహేశ్ చంద్ర లడ్డాలను వ్యక్తిగతంగా న్యాయస్థానంలో విచారణకు హాజరుకావాలని అదేశాలను వెలువరించింది. ఈ జనవరి 25కు ఈ కేసును వాయిదా వేసిన న్యాయస్థానం అదే రోజు హోం శాఖకు చెందిన ముగ్గురు ఉన్నాత అధికారులను న్యాయస్థానంలో హాజరుకావాలని అదేశిస్తూ నోటీసులను జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more