(Image source from: Hindustantimes.com)
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలిగొనింది. అంతేకాదు మరెందరనో తన ప్రభావానికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే ఈ కేసులు తగ్గుతున్న తరుణంలో దేశంలో నెమ్మదిగా కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వేళ్లూనుకుంటోంది. బ్రిటన్ నుంచి దేశానికి వస్తున్న వారిలో ఇది బయటపడుతోంది. లండన్ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన 30 మంది నమూనాలను సేకరించి పూణె వైరాలజీ ల్యాబ్ లో పరీక్షించగా చెన్నైకి చెందిన వ్యక్తికి కరోనా కొత్త వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
ఈ మేరకు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జె రాధాకృష్ణన్ మీడియాకు సమాచారం అందించారు, కొత్తరకం కరోనా దేశంలోకి చోచ్చుకురాకుండా భారత ప్రభుత్వం ముందస్తుగా బ్రిటన్ నుంచి దేశానికి వచ్చే విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినా దేశంలోకి ఈ కత్త రకం కరోనా చోచ్చుకొచ్చింది. తమిళనాడుకు చెందిన వ్యక్తికి నిర్థారణ కావడంతో మొత్తంగా దేశంలో ఆరుగురు వ్యక్తులు ఈ రకం కరోనాకు బాధితులయ్యారు. అయితే వీరి నుంచి ఇతరులకు కరోనా కత్తరకం స్ట్రెయిన్ సోకకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నవంబరు 25 నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన 2,200 మందికి పరీక్షలు నిర్వహించామని, వారిలో 17 మందిలో వైరస్ లక్షణాలు బయటపడినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, వారితో సంబంధాలు కలిగిన మరో 16 మందికి కూడా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. పాజిటివ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న 30 మంది నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్కు పంపగా, చెన్నైకి చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. బాధితుడిని ప్రస్తుతం గిండీలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more