కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గత ఇరవై ఒక్క రోజులుగా ఢిల్లీలోని శివారు సింఘు, టిక్రీ ప్రాంతంలో నిరసన చేపడుతున్న నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందోళన వ్యక్తం చేసింది. రైతుల నిరసనలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని.. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని వేయాలని యోచనలో వున్నట్లు తెలిపింది. రైతులు సాగిస్తున్న ఆందోళనలతో సామాన్య ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగిస్తుందని తక్షణమే వారిని ఖాళీ చేయించాలంటూ రిషబ్ శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది.
దీంతో పాటు రైతు సంఘాలు సాగిస్తున్న పోరాటం నేపథ్యంలోనూ వారికి మద్దుతుగా అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తూ కేంద్రం వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరు(కేంద్రం) విశాల దృక్పథంతో చర్చలు జరపనంతవరకూ అవి విఫలమవుతూనే ఉంటాయి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతులతో కేంద్రం చర్చలు ఫలించేలా కన్పించట్లేదని, త్వరలోనే ఇది జాతీయ సమస్యగా మారే అవకాశముందని జస్టిస్ బోబ్డే అన్నారు. అందుకే వివాద పరిష్కారం కోసం తామే ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు న్యాయస్థానం యోచిస్తుందని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని న్యాయస్థానానికి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రేపటిలోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. రైతుల ఆందోళనపై అన్ని పిటిషన్లను ఓకేసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more