(Image source from: ythisnews.com)
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటింగ్ శాతం మెరుగయ్యేందుకు పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అదే సమయంలో గతంలో ఓటర్లు చేసిన తప్పిదాలను కూడా పరిగణలోకి తీసుకుని కఠిన నిబంధనలను, శిక్షలను ఈ సారి ఎన్నికలలో అమలుపరుస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొందరు బ్యాలెట్ పత్రాలను ఫోటోలు తీసి.. వాటిని సామాజిక మాద్యామాల్లో పోస్టు చేసిన సందర్భాలు ఈ ఎన్నికలలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఎన్నికల కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని ఈ మేరకు పోలింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సీక్రెట్ బ్యాలెట్ విషయంలోని గోపత్యను ఎవరైన ఉల్లంఘనకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపారు, ఓటు వేసిన బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి దానిని గోప్యతను బయటపెట్టిన వ్యక్తలకు మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఓటు వేసిన తరువాత ఓటరు కూడా బ్యాలెట్ పత్రాన్ని ఎవరికీ చూపకుండా బ్యాలెట్ బాక్సులలో వేయాలని సూచించింది. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గోనే అధికారులు, సిబ్బందితో పాటు అభ్యర్థుల ఏజెంట్లు పూర్తిస్థాయిలో గోప్యత పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది, ఎన్నికల విధుల్లో గోప్యత విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ అధికారులకు పలు అదేశాలు జారీ చేసింది.
ఇక గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పుల పంఫిణీని ఈ నెల 25లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులను అదేశించింది. ఓటరు స్లిప్పుల పంఫిణీ కార్యక్రమం సంపూర్ణంగా జరగకపోవడం కారణంగా 2009, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోలింగ్ శాతం 50శాతానికి మించలేదని పేర్కోంది, ఈ సారి ఓటింగ్ శాతం పెరిగేలా జీహెచ్ఎంసీ పోలింగ్ అధికారులు నూటికి నూరు శాతం పోలింగ్ స్లిప్సులు పంచాలని ఎస్ఈసీ అదేశించింది. ఈ పంపిణీల సక్రమంగా జరుగుతుందా లేదా.? అన్న విషయాలను డిఫ్యూటీ కమీషనర్లెు, జోనల్ కమీషనర్లు పరిశీలించాలని అదేశించింది. ప్రతీ వార్డులో ఒక ఉద్యోగిని పంఫిణీ బాధ్యతలను అప్పగించాలని అదేశించింది. ఎవరికైనా ఓటరు స్లిప్పులు రాలేదని తేలితే వాటిని త్వరలోనే అందజేయాలని ఎన్నికల సంఘం సూచించింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more