ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులను, ప్రజాప్రతినిధులను బలితీసుకున్న కరోనావైరస్ మహమ్మారి మన దేశంలోనూ తన జడలువిప్పి లక్షన్నర మంది ప్రాణాలను బలిగొనింది. ఎందరో లెజండరీ ప్రముఖులపై ఈ మహమ్మారి కాటువేసి కబళించివేసింది. ఇప్పటికే యావత్ దేశం గర్వించదగ్గ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ సోకడంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయనే కాకుండా పలువురు కేంద్రమంత్రి, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ మహమ్మారి సోకింది. వీరిలో కొందరు పోరాడి ఓడారు.
తాజాగా ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడి చికిత్స పోందుతూ మరణించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదించిందని, దాని ప్రభావం కూడా అంతకంతకూ తగ్గుతూ వస్తోందని, ఇక కరోనాతో పెద్దగా భయపడాల్సిన పనిలేదని వార్తలు వినిపిస్తునప్పటికీ కరోనా మహమ్మారి మాత్రం ప్రజల ప్రాణాలను మాత్రం హరిస్తూనే ఉంది. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనాను కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు, ఇటీవల కరోనా సోకడంతో ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పోందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. అల్మోరా జిల్లాలోని సాదిగావ్ లో 8 డిసెంబరు 1969 జన్మించిన జీనా యాభై ఏళ్ల వయస్సులోనే కరోనాకు బలయ్యారు.
వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన అక్కడి ప్రజలకు తన సేవలతో మెప్పించారు. 2007లో తొలిసారి బిక్యాసెన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయనకు కుమాన్ మండల్ వికాస్ నిఘమ్ అనే సంస్థకు చైర్మన్ గా కూడా భాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. అయినా విధి ఎంతటి విచిత్రమైనదో.. సురేంద్రసింగ్ జీనా భార్య ఇటీవలే గుండెపోటుతో మృతి చెందారు. అంతలోనే జీనా మృతి ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నెలల వ్యవధిలోనే ఆయన పిల్లలు అనాధలుగా మారడం స్థానికులను కలచివేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more