Pawan Kalyan congratulates Raghunandan Rao బీజేపీ విజయంపై ఎవరేమన్నారంటే..

Dubbaka bypoll result 2020 pawan kalyan congratulates raghunandan rao for victory

Pawan Kalyan, Janasena, Raghunandhan Rao, BJP, solipeta ramalinga reddy, Harish Rao, dubbaka assembly constituency, dubbaka by poll, congress, TRS, BJP, congress, dubbaka byelection, K Chandrashekhar Rao, election result, telangana byelection, telangana byelection result, Telangana bypoll, trs, Telangana, Politics

The Janasena President Pawan Kalyan congratulates BJP candidate for his victory over the ruling TRS party candidate in the bypoll held for the Dubbaka constituency in Telangana

దుబ్బాక ఉపఎన్నిక: రఘునందర్ రావుకు పవన్ కల్యాణ్ అభినందనలు

Posted: 11/10/2020 11:14 PM IST
Dubbaka bypoll result 2020 pawan kalyan congratulates raghunandan rao for victory

తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిషాత్మకంగా మారిన దుబ్బాక ఉపఎన్నికలలో తుదకు విజయం వరించింది మాత్రం బిజేపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావునే. దీంతో రాష్ట్ర బీజేపి నాయకులు, కేంద్ర బీజేపి నాయకులు సైతం ఆయన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. రఘునందన్ రావుకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలను తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించి మరీ గెలిచిన రఘునందన్ రావుకు జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుతో పాటు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

బీజేపి పార్టీపైన, పార్టీ రాష్ట్ర నాయకత్వంపైనా దుబ్బాక ప్రజలు ప్రదర్శించిన విశ్వాసాన్ని శ్లాఘించిన ఆయన బీజేపి దేశవ్యాప్త ప్రజల నమ్మకమైన పార్టీగా ఎదుగుతుందని చెప్పేందుకు ఈ దుబ్బాక విజయమే నిదర్శనమని చెప్పారు, దుబ్బాక ఉపఎన్నిక విజయంలో భాగమైన ప్రతీఒక్క కార్యకర్తకు, అభిమానికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను చేపట్టిన తరువాత దక్కిన తొలి విజయం ఇదని.. ఇక వరుస విజయాలను ఆయన అందుకుంటారని పవన్ కల్యాణ్ అశాభావం వ్యక్తం చేశారు, ఈ మేరకు ఆయన జనసేన అధ్యక్షుడి హోదాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ విజయం దుబ్బాక ప్రజలకే అంకితం: రఘునందన్ రావు

 

దుబ్బాక ఉపఎన్నికలో ప్రజలు తనకు కట్టబెట్టిన విజయాన్ని తాను వారికే అంకితం చేస్తున్నట్లు బీజేపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ప్రకటించారు, తన నియోజకవర్గాల ప్రజల సేవలో తాను నిత్యం వుంటానని అన్నారు. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ తన చివరి శ్వాస వరకు సేవ చేస్తానన్నారు. గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపి చారిత్రాక విజయంతో రాష్ట్రంలో పాలకులకు కనువిప్పు కలగాలన్నారు, తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు, అధికార ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడినా.. అక్రమ కేసులు బనాయించినా.. వాటిని ఎదుర్కోని పోరాడినందకు ఫలితాన్ని ప్రజలు అందించారని రఘునందన్ రావు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles