తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిషాత్మకంగా మారిన దుబ్బాక ఉపఎన్నికలలో తుదకు విజయం వరించింది మాత్రం బిజేపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావునే. దీంతో రాష్ట్ర బీజేపి నాయకులు, కేంద్ర బీజేపి నాయకులు సైతం ఆయన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. రఘునందన్ రావుకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలను తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించి మరీ గెలిచిన రఘునందన్ రావుకు జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుతో పాటు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
బీజేపి పార్టీపైన, పార్టీ రాష్ట్ర నాయకత్వంపైనా దుబ్బాక ప్రజలు ప్రదర్శించిన విశ్వాసాన్ని శ్లాఘించిన ఆయన బీజేపి దేశవ్యాప్త ప్రజల నమ్మకమైన పార్టీగా ఎదుగుతుందని చెప్పేందుకు ఈ దుబ్బాక విజయమే నిదర్శనమని చెప్పారు, దుబ్బాక ఉపఎన్నిక విజయంలో భాగమైన ప్రతీఒక్క కార్యకర్తకు, అభిమానికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను చేపట్టిన తరువాత దక్కిన తొలి విజయం ఇదని.. ఇక వరుస విజయాలను ఆయన అందుకుంటారని పవన్ కల్యాణ్ అశాభావం వ్యక్తం చేశారు, ఈ మేరకు ఆయన జనసేన అధ్యక్షుడి హోదాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
దుబ్బాక ఉపఎన్నికలో ప్రజలు తనకు కట్టబెట్టిన విజయాన్ని తాను వారికే అంకితం చేస్తున్నట్లు బీజేపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ప్రకటించారు, తన నియోజకవర్గాల ప్రజల సేవలో తాను నిత్యం వుంటానని అన్నారు. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ తన చివరి శ్వాస వరకు సేవ చేస్తానన్నారు. గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపి చారిత్రాక విజయంతో రాష్ట్రంలో పాలకులకు కనువిప్పు కలగాలన్నారు, తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు, అధికార ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడినా.. అక్రమ కేసులు బనాయించినా.. వాటిని ఎదుర్కోని పోరాడినందకు ఫలితాన్ని ప్రజలు అందించారని రఘునందన్ రావు అన్నారు.
శ్రీ రఘునందన్ రావు, శ్రీ బండి సంజయ్ గార్లకు అభినందనలు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/TBn5K0vzDs
— JanaSena Party (@JanaSenaParty) November 10, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more