Arnab Goswami's bail to be heard today అర్నాబ్ గోస్వామి బెయిల్ నిరాకరణ.. 14 రోజుల రిమాండ్..

Bombay hc to continue hearing arnab goswamis plea against his arrest today

Arnab Goswami,Bombay High Court, Republic TV, Editor-in-Chief, judicial custody, architect Anvay Naik, non-payment of duesm abetment to suicide case, Arnab Goswami interim bail plea, N M Joshi Marg police station, Maharashtra, crime

The Bombay High Court on Friday refused to grant interim relief to Arnab Goswami, the Editor-in-Chief and owner of Republic TV, who has been remanded to 14-day judicial custody till November 18 in a 2018 abetment to suicide case.

అర్నాబ్ గోస్వామి బెయిల్ నిరాకరణ.. 14 రోజుల రిమాండ్..

Posted: 11/07/2020 02:34 PM IST
Bombay hc to continue hearing arnab goswamis plea against his arrest today

(Image source from: Zeenews.india.com)

రిపబ్లిక్ టీవీ సీఈఓ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటీషన్ పై వరుసగా మూడవ రోజు న్యాయస్థానం విచారించనుంది. 2018లో అర్కిటెక్ట్ సహా అతని తల్లి ఆత్మహత్యలు చేసుకున్న కేసులో అభియోగాలను ఎదుర్కన్న అర్నబ్ గోస్వామి అరెస్టై రెండు రోజులు కావస్తున్నా ఇప్పటికీ అతని ఊరట లభించలేదు, మధ్యంతర బెయిలు కోసం ఆయన పెట్టుకున్న పిటీషన్ ను క్రితం రోజున విచారించిన బాంబే హైకోర్టు సమయాభావం వల్ల ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ అర్నబ్ బెయిల్ పిటీషన్ పై విచారణను కోనసాగిస్తూ ఈ కేసులో ఇతర పార్టీల వాదనలను వినే అవకాశం వుంది. క్రితం రోజున అసంపూర్తిగా ముగిసిన వాదనలు ఇవాళ కకొనసాగనున్నాయి.

జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది, ప్రతివాది, రాష్ట్రప్రభుత్వం, అన్వయ్ నాయక్ కుటుంబ సభ్యుల పిటిషన్‌లతో పాటు వారి వాదనలను కూడా న్యాయస్థానం విననుంది. గత ప్రభుత్వం ఈ కేసును మూసివేసినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఉద్ధవ్ ప్రభుత్వం కేసును తిరిగి తెరిచింది. అర్నాబ్ ను బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. అర్నాబ్ ప్రస్తుతం కోవిడ్ కేంద్రంగా మార్చిన రాయ్ గడ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నారు. అయితే బుధవారం రోజునే ఆయన న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ వేయగా.. బాధితురాలి వాదనలు వినకుండా.. బెయిలు ఇవ్వమిన న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్.. అర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ఛానెల్ కు సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ పనులు చేసిన తరువాత అతడికి డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనతో పాటు ఆయన తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు, అయితే ఈ కేసులను గత బీజేపి ప్రభుత్వం తొక్కిపెట్టగా, ప్రస్తుతం మహారాష్ట్రలోని శివసేన కూటమి ప్రభుత్వం ఈ కేసును పునర్విచారించింది. దీంతో అర్నబ్ గోస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాగా అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో తమతో సహకరించాల్సిందిగా పోలీసులు పలుమార్లు అర్నాబ్‌ను కోరడం అందులో కనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles