ఆఫ్ఘనిస్థాన్ లో నెల రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు తమ చెలరేగిపోయి అమాయక విద్యార్ధుల ప్రాణాలను టార్గెట్ చేస్తున్నారు, ఓ వైపు ఆత్మహుతి దళాలతో భయాందోళనకు గురిచేసి మరోవైపు సాయుధులైన ముష్కరులు విశ్వవిద్యాలయాల్లోకి చోరబడి విద్యార్థులపై తూటాల వర్షం కురిపించారు. అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని కాబూల్ యూనివర్సిటీలో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి పాల్పడ్డారు, దేశంలోనే అతిపెద్దదైన విశ్వవిద్యాలయంలో రక్తపుటేర్లు పారడంలో అనేక మంది విద్యార్థులకు భయకంపితులయ్యారు, పలువురు విద్యార్థులు ప్రాణాలను చేతబట్టుకుని యూనివర్సిటీ ప్రహరీగోడలను దూకి వెళ్లిపోయారు, అయినా ఈ ఘటనలో ఏకంగా 22 మంది అమాయక విద్యార్ధుల ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్నారు.
కాబూల్ యూనివర్సిటీలో నిన్న నిర్వహించిన మారణహోమానికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్ స్టేట్ అప్ ఇరాక్ అండ్ లివట్ సహా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకున్నాయి, యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శనకు ఆఫ్ఘనిస్థాన్ లోని ఇరాన్ రాయబారి బహదూర్ అమినియన్, సాంస్కృతిక దౌత్యవేత్త మొజ్తాబా నొరూజితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్న సమాచారం తెలుసుకున్న ఉగ్రవాదులు ఈ మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో ముందుగా ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆత్మహుతి దళాల సభ్యులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి.. తమను తాము పేల్చుకున్నారు, ఆ వెంటనే అత్యాధునిక తుపాకులతో యూనివర్సిటీలోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు విద్యార్థులపైకి తూటాల వర్షం కురిపించారు. ఏం జరుగుతోందో తెలిసే లోపే 22 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఉగ్రవాదుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు పరుగులు తీశారు. పలువరు ప్రహరీ గోడలను ఎక్కి దూకారు, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 5 గంటలపాటు కాల్పులు కొనసాగాయి. దీంతో తుపాకులు, గ్రనేడ్ల మోతతో యూనివర్సిటీ దద్దరిల్లిపోయింది. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదులు ముగ్గురూ హతమయ్యారు. మరికొందరు మాత్రం తమ తరగతి గదుల్లోనే నక్కారు, బధ్రతా దళాల వచ్చి రక్షించే వరకు అక్కడే ప్రాణాలను గుప్పిట్టో పెట్టుకుని భయంభయంగా గడిపాయని విద్యార్థులు తెలిపారు, యూనివర్సిటీలో ఉగ్రఘటనను భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరులో ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more