యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించిన ఉగ్రదాడి అది. గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడం పట్ల దేశవిదేశాలు వారికి సానుభూతి తెలిపి.. భారత్ పక్షాన నిలిచాయి. జమ్మూకాశ్మీర్ లోని పూల్వమా మీదుగా అక్కడి మిలటరీ బేస్ కేంద్రాలకు వెళ్తున్న జవాన్లపై మందుగుండు నింపుకున్న అటో వచ్చి ఢీకొనడంతో దాడి జరుగగా.. అ వెంటనే కిందకు దిగిన జవాన్లపై తుటాల వర్షం కురిపించిన ముష్కరులు భారత జవాన్లు తేరుకుని ఎదురుకాల్పులకు దిగే లోపు పరారైన విషయం తెలిసిందే.
ఆ దాడితో యావత్ భారతం రగిలిపోయింది. అయితే ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనేనని యావత్ భారత్ అరోపించింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ అరోపణలను అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే భారత్ చేసిన అరోపణలు నిజమని.. వాటిలో ఏ మాత్రం అభ్యంతరాలు లేవని సాక్ష్యాత్తు పాకిస్థాన్ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి అదేశ పార్టమొంటులోనే నిసిగ్గుగా దొంగదెబ్బ తీయడం కూడా తమ గోప్పగా చెప్పుకోచ్చారు. ఈ దాడి పాక్ ప్రోద్బలిత దాడి అని అది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రోద్బలంతోనే జరిగాయని కూడా చెప్పుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
పాక్ ప్రభుత్వంపై అక్కడి విపక్షాలు సంధించిన ప్రశ్నలతో విస్తుపోయిన అధికార పక్షం తరపున పార్లమెంటులో తమ గొప్పులు చెప్పుకోచ్చిన మంత్రి.. ఏకంగా హిందుస్తాన్ లోని పూల్వామాలో జరిగిన దాడిని తమ గోప్పగా పేర్కోన్నారు. హిందుస్తాన్ లోకి చోరబడి వారి సొంతగడ్డపైనే వారి సైన్యాన్ని దారుణంగా దెబ్బకొట్టామని, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం పాక్ ప్రజల విజయం అని అభివర్ణించారు. ఇది యావత్ పాకిస్థాన్ విజయమని ఇందులో ప్రతీ పాకిస్తానీయుడికి భాగస్వామ్యం ఉందని గొప్పలకు పోయారు, ఈ వ్యాఖ్యలను కొందరు పార్లమెంటు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఫవాద్ చౌదరి వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో యావత్ ప్రపంచానికి పాకిస్తాన్ నిజస్వరూపం అర్థమైంది. వెంటనే పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాను మాట్లాడింది పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించేనని ఫవాద్ చైదరి చెప్పారు. అమాయకులను చంపి తాము ధైర్యవంతులం అని చెప్పుకోవాల్సిన పని తమకు లేదని అన్నారు. ఉగ్రవాదానికి తాము ముందు నుంచి వ్యతిరేకమే అని చెప్పారు. తన మాటలను భారత మీడియా వక్రీకరించిందని అన్నారు. పుల్వామా దాడి చేయించింది పాకిస్థానే అని తాను అనలేదని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
#WATCH: Pakistan's Federal Minister Fawad Choudhry, in the National Assembly, says Pulwama was a great achievement under Imran Khan's leadership. pic.twitter.com/qnJNnWvmqP
— ANI (@ANI) October 29, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more