(Image source from: Independent.co.uk)
దాయాధి పాకిస్థాన్ తాను పెంచిపోషిస్తున్న ఉగ్రవాదానికి తమ దేశ భావిపౌరులే అమరులయ్యారు, పెషావర్ నగరంలో ఇవాళ భారీ బాంబు పేలుడు సంభవించింది, అది కూడా చిన్నారి విద్యార్ధులు చదివే మదర్సాలను కేంద్రంగా చేసుకుని బాంబు అమర్చారు. దీంతో బాంబు విస్పోటనం ధాటికి ఏడుగురు చిన్నారులు మృత్యుఒడికి చేరుకున్నారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ నగర శివార్లలో ఉన్న ‘ఇస్లామిక్ సెమినరీ’ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ బాంబును అమర్చినట్టుగా అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. తరగతులు జరుగుతుండగా.. అకస్మాత్తుగా పేలిన ఈ బాంబు విస్పోటన భారీ పేలుడు శబ్దానికే భయకంపితులైన చిన్నారులు అసువులు బాసారు.
స్థానిక మదర్సాలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు బ్యాగుతో ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. పేలుడులో ఐఈడీని ఉపయోగించినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. దాదాపు ఐదు కిలోల ఐఈడీని ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. ఆ ఉగ్రవాద ఘోరకలికి ఏడుగురు చిన్నారులు బలికాగా, సుమారు 70 మంది స్థానికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ది లేడీ రీడింగ్ అసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు అసుపత్రి అధికార ప్రతినిధి తమ అసుపత్రికి 70 మంది క్షతగాత్రులురాగా, వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కాగా అభంశుభం ఎరుగని ఏడుగురు చిన్నారులను బలిగొన్న ఈ దారుణ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాద మూకలే ఈ దారుణానికి ఒడిగట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్ అర్మీ స్కూల్ లోకి వెళ్లి దాడులకు పాల్పడిన ముష్కర మూకల దాడి గుర్తుకు వస్తోంది. కాగా ఈ దాడిని పాకిస్థాన్ అధికార, విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అఫ్గానిస్థాన్ తో సరిహద్దులు పంచుకునే ఖైబర్ పంఖ్తుంక్వా రాష్ట్రానికి పెషావర్ నగరం రాజధాని. ఒకప్పుడు ఉగ్రవాద దాడులకు ఇది కేంద్రంగా ఉండేది. భద్రతా సిబ్బంది, జన సమూహాలను లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులకు పాల్పడేవారు. ఉగ్రవాద దాడులతో పాటు వేర్పాటువాదుల వల్ల కూడా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతుండేవి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more