Navaratri festival Starts at Indrakeeladri ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు

Dasara celebrations begin at durga temple on indrakeeladri

Kanaka durgadevi Temple, dasara celebrations, swarna kavachalankuta durga devi, Dasara celebrations at Durga temple , Indrakeeladri, Dasara celebrations, 9 days Dasara celebrations, dasara navaratri, COVID-19, Coronavirus, Indrakeeladri, Vijayawada, Andhra Pradesh, Alampur, jogulamba Temple, Shaktipeetam, Mahaboobnagar, Telangana

The nine-day Dasara celebrations have begun at the Durga temple on Indrakeelthe hillock today morning on a grand note. On the first day, the Goddess Kanaka Durga will be attired as Swarna Kavachalankuta Durga Devi. The temple administration has made all arrangements for the darshan of devotees.

ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు

Posted: 10/18/2020 12:54 AM IST
Dasara celebrations begin at durga temple on indrakeeladri

(Image source from: Thehansindia.com)

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రులలో మొదటి రోజైన ఇవాళ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. స్వర్ణకవచాలంకృత రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల దరిద్రాలు పోతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాల మొదటి రోజు కావడంతో ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాదికాలన్నీ పూర్తి చేసి 9గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తుల శ్రీనివాసులు, ఆలయ ఈవో సురేష్ బాబు దంపతులు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు.

ముందుగా జారీ చేసిన టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. దాదాపు 4వేల మంది పోలీసులు ఉత్సవాల భద్రతలో పాల్గొంటున్నారు. ప్రతి గంటకు వెయ్యి మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఈవో సురేష్ బాబు వెల్లడించారు. దేవస్థానంలో ఏటా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీయాగాలను కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా భక్తుల పరోక్ష భాగస్వామ్యంతో రుత్వికులు నిర్వహిస్తారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్‌ అజాద్ ను దేవాదాయ శాఖ నియమించింది.

ిక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తులకు వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొండ దిగువన వినాయక ఆలయం దగ్గర నుంచి క్యూలైన్లు ఆరంభమవుతాయని చెప్పారు. కొండ దిగువన మూడు క్యూలైన్లుగా ఆరంభమై.. పైకి వచ్చాక ఓం టర్నింగ్‌ వద్ద ఐదు లైన్లుగా విడిపోతాయి. అక్కడి నుంచి ఉచిత, రూ.100, రూ.300 లైన్లలో భక్తులు దర్శనాలకు వెళతారు. అమ్మవారి దర్శనం చేసుకున్నాక.. మెట్ల మార్గంలో కిందకు వచ్చేస్తారు. కింద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అన్నదానం ఏర్పాటు చేయలేదు.

* భక్తులు మాస్క్‌, చేతులకు గ్లౌజులు తప్పనిసరి

* క్యూలైన్లలో సామాజిక దూరం పాటించాలి. వృత్తాలలో నిలబడి వెళ్లాలి.

* భక్తులు సొంతంగా తాగు నీరు తెచ్చుకోవాలి.

* పది సంవత్సరాల లోపు, 65ఏళ్లు పైబడిన వాళ్లు, దివ్యాంగులకు అనుమతి లేదు.

* నిర్ధేశించిన టైమ్ స్లాట్ కు 15 నిమిషాల ముందే అనుమతి.

* ఆలయానికి లిఫ్టు, బస్సు సౌకర్యం ఉండదు. ఘాట్ రోడ్డులో దారి పూర్తిగా నిలిపేస్తారు.

* కొండ దిగువన రథం సెంటర్లోనే భక్తులకు క్లోక్ రూంలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles