(Image source from: Thehansindia.com)
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రులలో మొదటి రోజైన ఇవాళ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. స్వర్ణకవచాలంకృత రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల దరిద్రాలు పోతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాల మొదటి రోజు కావడంతో ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాదికాలన్నీ పూర్తి చేసి 9గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసులు, ఆలయ ఈవో సురేష్ బాబు దంపతులు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు.
ముందుగా జారీ చేసిన టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. దాదాపు 4వేల మంది పోలీసులు ఉత్సవాల భద్రతలో పాల్గొంటున్నారు. ప్రతి గంటకు వెయ్యి మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఈవో సురేష్ బాబు వెల్లడించారు. దేవస్థానంలో ఏటా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీయాగాలను కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా భక్తుల పరోక్ష భాగస్వామ్యంతో రుత్వికులు నిర్వహిస్తారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్ అజాద్ ను దేవాదాయ శాఖ నియమించింది.
ిక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తులకు వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొండ దిగువన వినాయక ఆలయం దగ్గర నుంచి క్యూలైన్లు ఆరంభమవుతాయని చెప్పారు. కొండ దిగువన మూడు క్యూలైన్లుగా ఆరంభమై.. పైకి వచ్చాక ఓం టర్నింగ్ వద్ద ఐదు లైన్లుగా విడిపోతాయి. అక్కడి నుంచి ఉచిత, రూ.100, రూ.300 లైన్లలో భక్తులు దర్శనాలకు వెళతారు. అమ్మవారి దర్శనం చేసుకున్నాక.. మెట్ల మార్గంలో కిందకు వచ్చేస్తారు. కింద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అన్నదానం ఏర్పాటు చేయలేదు.
* భక్తులు మాస్క్, చేతులకు గ్లౌజులు తప్పనిసరి
* క్యూలైన్లలో సామాజిక దూరం పాటించాలి. వృత్తాలలో నిలబడి వెళ్లాలి.
* భక్తులు సొంతంగా తాగు నీరు తెచ్చుకోవాలి.
* పది సంవత్సరాల లోపు, 65ఏళ్లు పైబడిన వాళ్లు, దివ్యాంగులకు అనుమతి లేదు.
* నిర్ధేశించిన టైమ్ స్లాట్ కు 15 నిమిషాల ముందే అనుమతి.
* ఆలయానికి లిఫ్టు, బస్సు సౌకర్యం ఉండదు. ఘాట్ రోడ్డులో దారి పూర్తిగా నిలిపేస్తారు.
* కొండ దిగువన రథం సెంటర్లోనే భక్తులకు క్లోక్ రూంలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more