Hathras Accused writes letter to SP, cites innocence నిర్దోషులమంటూ యూపీ పోలీసులకు హాత్రాస్ నిందితుల లేఖ

Hathras case victims brother mother killed her claims main accused in letter to police

hathras gangrape case, Victim, Accused Sandeep, Accused Sandeep Ravi, Lav Kush Ramu, Sandeep letter, Uttar Pradesh Police, Victim Brother, Victim Mother, yogi adityanath, UP Police, SIT, Bajrang Dal, Karni Sena, RSS, BJP leader, former MLA, Rajveer Pahalwan, right wing groups, uma bharati, Uttar Pradesh, Politics, Crime

In an interesting development in the case of Hathras alleged gangrape and murder case, a copy of letter purportedly written by the main accused Sandip to the Superintendent of Police of Hathras came out on the social media on Thursday. In the letter, Sandeep wrote that he was innocent and the other three were also not involved in the matter.

హాత్రాస్ ఘటన: నిర్దోషులమంటూ యూపీ పోలీసులకు నిందితుల లేఖ

Posted: 10/08/2020 09:17 PM IST
Hathras case victims brother mother killed her claims main accused in letter to police

(Image source from: Bhaskarhindi.com)

దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటన రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందుతులకు కఠిన శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో సొంత పార్టీకి చెందిన బీజేపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా వారితో గళం కలిపారు. ఓ వైపు దేశప్రజలలో ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న క్రమంలోనే బీజేపి ఎమ్మెల్యే బల్లియ సురేంద్ర సింగ్ ఈ ఘటనపై స్పందిస్తూ అత్యాచారాలు జరగకూడదంటే అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు విలువలు నేర్పించాలని పలికాడు.

ఇక మరో బీజేపి మాజీ ఎమ్మెల్యే ఏకంగా హాత్రాస్ జిల్లాలోని బాధిత కుటుంబం నివసించే బూల్ గది ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో నిందితులకు మద్దతుగా కొంతమంది తన అనుఛరులతో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. హ‌త్యాచార నిందితుల‌కు న్యాయం జ‌ర‌గాల్సిందేనని డిమాండ్ చేస్తూ 144 సెక్షన్ అమల్లో వున్నా సభను మాత్రం నిర్వహించాడు. ఈ సభకు హాజరైన వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేయని పోలీసులు.. లాఠీ జుళింపించలేదు.. ఎవరిని కిందకు తోసివేయలేదు.. ఎవరి వస్త్రాలను కూడా పట్టుకోనూ లేదు. సభకు రావద్దని ఎక్కడా అక్షేపణలు చెప్పనూ లేదు. ఇక పైగా రండీ హుజూర్ అంటూ సభ నిర్వాహకులకు స్వాగతం పలకడంతో పాటు వారికి బందోబస్తు కూడా కల్పించడం కొసమెరుపు.

ఇళా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీల మద్దత్తు కూడగట్టకుంటున్న నేపథ్యంలో ఇక నిందితులు తామేం తక్కువ కాదంటూ ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకే లేఖ రాశారు. తమను అనవసరంగా కేసు బనాయించారని, ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము పూర్తిగా నిర్దోషులమని నిందితులు సందీప్, రాము, లవ్ కుష్, రవి లేఖలో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న సందీప్, ఘటనపై వివరాలను వెల్లడిస్తూ, ఆ యువతిపై తాను లైంగిక దాడి చేయలేదని పేర్కోన్నాడు. అయితే బాధితురాలు తనకు తెలుసునని కూడా చెప్పాడు. ఆమెతో పాటు అమె సోదరుడు కూడా తనకు బాగా పరిచయమని, ఓ విధంగా స్నేహితుడేనని పేర్కోన్నాడు.

అంతేకాదు బాధితురాలు మరణానికి తల్లి, సోదరుడు కారణమని అరోపించిన సందీప్.. తమపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపాడు. బాధితురాలి సోదరుడు తనకు స్నేహితుడని.. తరచూ కలుస్తూనే వుంటాడని తెలిపాడు. ఫోన్ లోనూ తాము మాట్లాడుకుంటామని అన్నాడు. ఇదిలావుంచితే, సందీప్ కోసం ఓ ఫోన్ నంబర్ ను బాధితురాలి సోదరుడు తన పేరు మీద రిజిస్టర్ చేసి, కొని ఇచ్చాడని కూడా తెలుస్తోంది. అయితే, తాను సందీప్ తో మాట్లాడుతానన్న విషయాన్ని బాధితురాలి సోదరుడు ఖండించడం గమనార్హం. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న క్రమంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.  ఇక నిందితులకు అండగా అధికార బీజేపికి చెందిన పలువురు నేతలతో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ నేతలు, భజరంగ్ ధళ్ నేతలు సహ పలు సంఘాలు మద్దుతుగా నిలుస్తుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles