దేశీయ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బిగ్ బిలయన్ డేస్ సేల్ ను నిర్వహించేందుకు పూర్తిగా సన్నధమైంది, భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో తమ హంగామా సేల్ ను ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ సేల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా దేశీయంగా అధికంగానే వుంది. ఈ తరుణంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమయ్యే తేదీలను సంస్థ ప్రకటించింది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ సారి రెండు రోజుల అదనంగా ఆరు రోజుల పాటు కోనసాగనుందని తెలిపింది.
సేల్ జరిగే తేదీలను ఫ్లిప్ కార్ట్ ఇవాళ ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు ఆ సేల్ కొనసాగనుంది. ఈ క్రమంలో సేల్ లో భాగంగా అనేక ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లను అందించనున్నారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఎస్బీఐ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు సేల్ అక్టోబర్ 15వ తేదీ నుంచే అందుబాటులోకి వస్తుంది. సేల్ లో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తారు. బజాజ్ ఈఎంఐ కార్డుతోనూ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్ బ్యాక్ ను అందిస్తారు.
సేల్ లో బాగంగా మొబైల్స్, టీవీలు, హోం అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు తదితర అనేక ఉత్పత్తులపై ఆకట్టునే ఆఫర్లు, రాయితీలను అందిస్తారు. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ సేల్ లో అందించే అనేక ఆఫర్ల వివరాలను వినియోగదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. కాగా మరో వైపు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కానీ ఆ సంస్థ ఆ సేల్ తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఫ్లిప్కార్ట్ సేల్ తేదీని ప్రకటించింది కనుక అమెజాన్ కూడా సేల్ తేదీని త్వరలోనే ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ పోటీలో ఎవరు ఎలాంటి ఆపర్లును కస్టమర్లకు తీసుకువస్తారో వేచి చూడాల్సివుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more