రైతు భూములకు పట్టాదార్ పాసుపుస్తకాలను అందించే రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలిసిందే. అయితే దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు కలిగున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. త్వరలో అమల్లోకి రానున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా మిగతా ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు.
భూ వివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించటంతోపాటు వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించటం కోసమే పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న ఇండ్లు, ఫామ్ హౌజ్లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటికీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని సూచించారు.
దీంతో ఇక భవిష్యత్తులో భూముల లావాదేవీలు ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకి బదిలీ చేయాలంటే ధరణి పోర్టల్ ద్వారానే అది సాధ్యమవుతుందని (రిజిస్ట్రేషన్) తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఇంటి నెంబరు, ఆధార్ కార్డుతో సహా కుటుంబ సభ్యుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆస్తుల వివరాలను ఇప్పుడు మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో వాటిని తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. నిరు పేదలు ఎన్నో ఏండ్లుగా ఉంటున్న ఇండ్ల స్థలాలను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడటంతో పాటు వారికి రుణాలను కూడా పోందే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more