ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో అంశంలోనూ ప్రభుత్వంపై సునిశిత విమర్శలను కొనసాగించారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాల విషయంలో తన సోంత పార్టీపై విమర్శలు చేస్తూ, తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేల అరచకాలు చేస్తున్నారంటూ అరోపణలు చేసిన ఆయన తాజాగా మరోమారు తిరుమల వెంకన్న సంపదపై తన పార్టీ నేతల కన్ను పడిందని అరోపించారు. ఈ విషయాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారని అన్నారు.
అయితే దేవుడి సొమ్ము కొట్టేసిన వాడు బాగుపడినట్టు చరిత్రలో లేదని.. దేవుడి సొమ్మును కాజేయాలని చూపిన వాళ్లకి ఆయనే తన ప్రతాపాన్ని చూపుతాడని అన్నారు. ఉన్నపళంగా కరోనా కష్టసమయంలోనూ టీటీడీలో కొనసాగుతున్న ఇద్దరు అధికారులను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందందని ఆయన ప్రశ్నించారు, రథం తగలబడిన ఘటనలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ఇక ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం కొత్త రథాలకు తమ జేబులోంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇస్తున్నదంతా ప్రజల డబ్బేనని అన్నారు.
అమ్మవారి వెండి విగ్రహాలు పోతే, ఆ పోయాయిలే అని తేలిగ్గా తీసిపారేయడం తగదని వ్యాఖ్యానించారు. దేవాలయాలపై జరిగిన దాడులు హిందువులకు తగిలిన గాయాలు అని పేర్కొన్నారు. పరిస్థితి ఇలావుంటే, మరోపక్క హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు అమరావతి అంశంపైనా స్పందించారు. గతంలో అత్తారింటికి దారేది అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు అమరావతికి దారేది అంటున్నారని తెలిపారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. తమ ఎంపీలు జీఎస్టీ బకాయిలపై కాకుండా ఇతర అంశాలపై పోరాటం చేస్తున్నారంటూ రఘురామ వ్యంగ్యం ప్రదర్శించారు.
కాగా ఎంపీ రఘురామకృష్ణరాజు దళితులంటే అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ధ్వజమెత్తారు. సెక్యూరిటీ సిబ్బంది తన రక్షణ కోసమే తప్ప ఎదుటివాళ్లను చంపడానికి కాదు, చర్మం వలవడానికి కాదన్న విషయాన్ని మర్చిపోయి మరీ దళితులపై విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. దళితుల పట్ల అసూయతో రగిలిపోతన్నారని ఇది ప్రజాస్వామ్యంలో సముచితం కాదన్నారు. ఈ పరిణామాలపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. రఘురామకృష్ణరాజుకు దళితులన్నా.. దళిత కులాలన్నా చిన్నచూపు ఉందని అది పోవాలని, సురేశ్ అన్నారు. ఆయన తీరుపై లోక్ సభ స్పీకర్ కూడా పిర్యాదు చేయనున్నామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more