(Image source from: India.com)
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రభావం చివరాఖరన ఉద్యోగుల భవిష్యనిధిపై కూడా పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలొ మాదిరిగా ఒకేసారి ఈ వడ్డీని జతచేసే బదులుగా రెండు వాయిదాల్లో్ జమ చేయనున్నారు. కరోనా ప్రభావంతోనే కేంద్రం ఇలా రెండు వాయిదాల రూపంలో వడ్డీలను జమచేయనుంది. అయితే మొత్తానికి వడ్డీ రావడం కార్మికులకు ఆనందాన్ని పంచుతోంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈపీఎఫ్ చందాదారులుగా వున్న దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. తొలి విడతగా పీఎఫ్ ఖాతాల్లోని నిధిపై 8.15 శాతం వడ్డీని ఈ నెలలో జమచేయనున్న కేంద్రం.. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరు నెలలో జమ చేయనున్నట్లు ఈఫీఎఫ్ బోర్డు సమావేశంలో ట్రస్టీలు నిర్ణయం తీసుకున్నారు. తన వద్దనున్న కొన్ని పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చాలని ఈపీఎఫ్ఓ గతంలో యోచించింది. కానీ కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మార్కెట్లు స్థిరంగా లేనందువల్ల ఆ యోచనను విరమించుకుంది.
అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తున్న వడ్డీ మాత్రం తక్కువే. గత 2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ నిధిపై వడ్డీ రేటు 8.65శాతంగా ఇచ్చిందీ కేంద్రం. అదే వడ్డీ రేటుతో ఈపీఎఫ్ క్లెయిమ్ లను పరిష్కరించింది. ఇదిలావుండగా 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి క్రమేపి పెరుగుతూ వస్తున్న ఈపీఎఫ్ వడ్డీ రేటు 2015-16లో అత్యధికానికి చేరింది. ది 2013-14తో పాటు 2014-15లో 8.75 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. ఆ తరువాత 2015-16లో 8.8 శాతంగా పెరిగింది. ఇక ఆ తరువాత 2016-17 సంవత్సరానికి 8.65%, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. ఈ సారి కరోనా నేపథ్యంలో 8.5కు మాత్రమే పరిమితమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more