నిజాయితీగా రుణాలను చెల్లించే రైతులు, సామాన్యులను ఫలనా డాక్యూమెంట్ కావాలని, ఒకటి తరువాత మరోకటి ఇలా చెప్పి చెప్పులరిగేలా కస్టమర్లను తిప్పించుకునే బ్యాంకులు.. కాస్తా కూస్తో పరపతో లేక పైసానో పెడితే మాత్రం ఎంచక్కగా పనులు చేసిపెడతారు. రుణాలను ఇచ్చిన తరువాత తిరిగి చెల్లించడంలో మాత్రం ఇలాంటి వారిలో కనీసం పది మంది వరకు బ్యాంకు రికవరీ అధికారులు చెప్పులరిగేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడల్లా బ్యాంకు అధికారుల మీద సానుభూతి ఏర్పడే కన్నా.. నేను నిజాయితా కట్టేవాడ్ని కానీ నాకు రుణం ఇవ్వలేదన్న సామాన్యులే గొంతులే అధికంగా వినిపిస్తుంటాయి.
ఓ వైపు ఇప్పటికే బడాబాబులు బ్యాంకు అధికారులనే తమ ఇళ్ల చుట్టూ తప్పించుకుని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలను రుణాలు పోంది వాటిని ఎగవేసి విదేశాలకు పోయి తలదాచుకుంటున్నారు. ఇక వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న వారు రాజకీయ పార్టీలో చేరి.. ఏ పార్టీ అధికారంలో వుంటే దాని పంచన చేరి రుణాలను చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇలా వారు పొందిన రుణాలన్నీ ప్రజల సొమ్మని వాటినే బ్యాంకులు రుణాలుగా ఇస్తున్నాయన్న విషయం తెలియని సామాన్యుడు మాత్రం బ్యాంకుల నుంచి రుణాల పోందేందుకు నానా యాగీ పడుతుంటాడు.
తాజాగా జరిగిన ఘటన మాత్రం అందుకు భిన్నం. రుణాలను తీర్చాలని అడిగేందుకు వచ్చిన బ్యాంకు రికవరీ అధికారులపై కేసులు పెడతామని బెదిరించిందో మహిళ. అదీ తన ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చారని కాదు ఏకంగా తనపై అత్యాచారం చేయబోయారన్న కేసు పెట్టి ఊచలు లెక్కబెట్టిస్తానని హెచ్చరించింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ఇందిరా నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది, అమె ఇంటికి వెళ్లిన బ్యాంకు అధికారులు నోళ్లు తెరియబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సంగీత దంపతులు బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేశారు.
అయితే కరోనా సమయం కన్నా ముందు నుంచే వారు ఇంటి కోసం తీసుకున్న రుణం చెల్లించడం లేదు, దీంతో బ్యాంకు రికవరీ అధికారులు వారి ఇంటికి వచ్చి ఇంట్లో వున్న సంగీత భర్తను రుణం చెల్లించమని అభ్యర్ధించారు. దీంతో ఆయన బ్యాంకు అధికారులకు సమాధానం ఇస్తున్నారు, ఈ తరుణంలో కోపోద్రిక్తురాలైన సంగీత బ్యాంకు అధికారులపై ఫైర్ అయ్యారు. బ్యాంకు అధికారులను కించపరిచేలా మాట్లాడారు. నా భర్తను లోను కట్టమని అడగటానికి నీకెంత ధైర్యం… అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు నన్ను రేప్ చేశారని…మీ మీద అత్యాచారం కేసుపెడతానని బెదిరించారు.
అయితే బ్యాంకు రివకరీ అధికారుల్లో ఒకరు ఈ తతంగాన్ని మొత్తం వీడియోలో బంధించి.. దానిని సామాజిక మాద్యమాల్లో అప్ లోడ్ చేశారు. ఇంకేముందీ ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. రుణం తీర్చమన్నందుకు బ్యాంకు అధికారులపై సంగీత రెచ్చిపోవడం.. కేసు పెడతానని బెదిరించడం అంతా వీడియోలో నిక్షిప్తమైంది. అయితే బ్యాంకు అధికారులు ఆమె కాళ్ళు పట్టుకోటానికి కూడా సిధ్దం కావడం మాత్రం బ్యాంకు అధికారుల ముందస్తు పన్నాగమా.? అన్న అనుమానాలకు కూడా తావిస్తోంది. ఈ వీడియో ఆధారంగా సామాజిక కార్యకర్త ప్రియా ఆర్య సంగీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగీత తన హక్కులు, చట్టాలను దుర్వినియోగం చేసిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కోన్నారు. సంగీత పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామిని బెంగుళూరు తూర్పు మండలం డీసీపీ శరణప్ప తెలిపారు.
Bank people came home to do recovery for a loan,just look at this woman’s audacity the way she has behaved with them!
— Lotus (@LotusBharat) September 6, 2020
At this rate what recovery can happen? pic.twitter.com/UX4DrRbkJA
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more