బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో డ్రగ్స్ కోణం ఉందన్న అనుమానాలకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో చోటుచేసుకున్న పరిణామాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. తాజాగా ఎన్సీబీ అధికారులు సుశాంత్ సింగ్ ప్రేయసిగా గుర్తింపు పోందిన నటి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా విచారిస్తున్న అమెను తాజాగా ఎన్సీబి అధికారులు ఇవాళ అరెస్టు చేశారు, తాను డ్రగ్ అడిక్ట్ కాదని చెబుతూ వచ్చిన అమె.. తాజాగా తాను సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు అంగీకరించింది. దీంతో అమెను అదుపులోకి తీసుకున్న ఎన్సీబి అమెను అరెస్టు చేసింది.
ఇప్పటికే డ్రగ్స్ కు సంబంధించి రియా చక్రవర్తి నుంచి కీలక సమాచారం రాబట్టిన ఎన్సీబీ... మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ కు సంబంధించి ఎన్సీబి విచారణలో ఇప్పటికే పలువురు బడా హీరోలు, ప్రముఖ నటులు, నటీమణులతో పాటు వాటికి బానిసలైన మరికొందరి పేర్లను కూడా రియా ఎన్సీబికి వెలువరించిందని సమాచారం. ఆ సమాచారం మేరకు ఎన్సీబీ దర్యాప్తులో వేగం పెంచిదని తెలుస్తోందని క్రైమ్ డిటెక్టివ్ లు అంచనా వేస్తున్నారు. సుశాంత్ మరణంలో డ్రగ్స్ వ్యవహారమే కేంద్రబిందువుగా ఉన్నట్టు వీరు అనుమానిస్తున్నారు.
ఇదిలావుండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. దీనికి తోడు రంగంలోకి దిగిన ఎన్సీబి కూడా రియా చుట్టూ ఉచ్చును బిగిందని వార్తలు వచ్చాయి. విచారణలో భాగంగా ఇవాళ ముంబైలోని ఎన్సీబి కార్యాలయానికి హాజరైన అమెను రెండు దఫాలుగా విచారించిన ఎన్సీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అమెను అరెస్టు చేశారన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే రియాను ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపించడంలేదు. రియాకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించాలని నార్కొటిక్స్ అధికారులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more