కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు మళ్లీ పునరుద్దరించనున్నారు. ఈ మేరకు కేంద్ర అన్ లాక్ 4.0 తో అనుమతులు లభ్యం కావడంతో ఈ నెల 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ఆరు మాసాల తరువాత కూతకు సన్నధం అవుతోంది. మెట్రో రైళ్లను నడపడానికి ఇప్పటికే కేంద్రం అనుమతించగా, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది.
ఇక అన్ లాక్ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి ఆన్లైన్, దూరవిద్యా తరగతులు నిర్వహణకు అనుమతినిచ్చిన కేంద్రం.. వీటిని ప్రోత్సహించాలని సూచించింది. కాగా, పాఠశాలలు, కళాశాలలు, విద్యా శిక్షణ సంస్థలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్, వినోద పార్కులు, థియేటర్లపై నిషేధం కొనసాగుతుందన్న కేంద్ర ప్రభుత్వం.. ఓపెన్ ఎయిర్ థియేటర్లు నడుస్తాయని వెల్లడించింది. కాగా, బార్లు, క్లబ్లు మూసి ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం తాజాగా అదేశాలను జారీ చేసింది. ఇక మెట్రో రైలు సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.
* కంటైన్మెంట్ జోన్లలో ఉండే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు.
* థర్మల్ స్క్రీనింగ్ తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే స్టేషన్ లోపలకు అనుమతిస్తారు.
* సామాజికదూరాన్ని పాటించే నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైళ్లు కొన్ని స్టేషన్లలో ఆగకుండానే వెళ్లిపోతాయి.
* అతి తక్కువ లగేజీని మాత్రమే అనుమతిస్తారు. మెటల్ ఐటెమ్స్ ని అనుమతించరు.
* సామాజికదూరాన్ని పాటించే క్రమంలో స్టేషన్లతో పాటు, రైలు బోగీల్లో కూడా మార్కింగ్ వేస్తారు.
* ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా మాస్కులు కచ్చితంగా ధరించాలి. మెట్రో స్టేషన్లలో మాస్కుల విక్రయాలు జరపాలి.
* ఆరోగ్యసేతు యాప్ ను వినియోగిస్తే మంచిది.
* స్టేషన్ ఎంట్రన్స్ లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి.
* తరచుగా స్టేషన్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.
* స్మార్ట్ కార్డ్, ఆన్ లైన్ చెల్లింపులకు ప్రాధాన్యతను ఇవ్వాలి.
* టోకెన్లు, టికెట్లను కూడా సరైన రీతిలో శానిటైజ్ చేయాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more