Saina Nehwal Pays a Surprise Visit to MetroMedi ‘మెట్రోమెడీ’ని సందర్శించిన సైనా నెహ్వాల్, కశ్యప్

Saina nehwal thanks metromedi for wonderful evening with kashyap

MetroMedi, MetroMedi Start-up Pharma, MetroMedi Online pharmacy, MetroMedi Dilip C Byra, MetroMedi Saina Nehwal, MetroMedi Parupally Kashyap, Start-up Pharma, Online pharmacy, Dilip C Byra, badminton star couple, Saina Nehwal, Parupally Kashyap, Hyderabad

MetroMedi is an omnichannel pharmacy and is operating across the major cities of Telugu states. Dilip C Byra started the company in 2018, today the badminton star couple Saina Nehwal and Parupally Kashyap had a Suprise Visit. Saina had mentioned Thanks to Metromedi for having a wonderful evening with Kashyap at Office.

ఆన్ లైన్ ఫార్మసీ ‘మెట్రోమెడీ’ని సందర్శించిన సైనా నెహ్వాల్ జోడి

Posted: 09/02/2020 12:19 AM IST
Saina nehwal thanks metromedi for wonderful evening with kashyap

(Image source from: Twitter.com/Metromedi01)

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలలో ఆన్ లైన్ ఫార్మసీ సేవలు అందిస్తున్న మెట్రో మెడీ సంస్థకు అనూహ్య అతిధులు వచ్చారు. సాయం సంధ్య సమయంలో ఉద్యోగులంతా తమ తమ విధుల్లో ఉండగా అతిధులను చూసి ఒక్కసారిగా అవ్వకయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త బైరా దిలిప్ చక్రవర్తి అతిధులకు సాదరంగా అహ్వానం పలికారు. ఆన్ లైన్ మెడిసిన్ సేవలు అందిస్తున్న మెట్రో మెడి సంస్థ తీరుతెన్నులను అతిధులకు వివరించారు. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు ఎలా వస్తాయో. వాటిని నిర్ణీత కాల వ్యవధిలో ఎలా అందచేస్తారన్న విషయాలను వారికి వివరించారు. ఇంతకీ ఆ అతిధులు ఎవరని అంటారా.?

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్.. తెలుగింటి కోడలు సైనా నెహ్వాల్ అమె భర్త బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ లు మెట్రోమెడిలోకి అడుగుపెట్టిన అతిధులు. ఒలంపిక్ ఫోటీలకు సన్నధం అవుతున్న తరుణంలో వారిద్దరూ తమ శిక్షణను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అలా ఇవాళ్టిని శిక్షణను ముగించుకున్న తరువాత ఇంటికి వెళ్తూ.. తన భర్త కశ్యప్ తో పాటుగా అమె మెట్రోమెడీ అన్ లైన్ ఫార్మసీ సంస్థను అకస్మాత్తుగా సందర్శించి అక్కడి సిబ్బందిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. వారిని సంస్థ అధినేత బైరా దిలిప్ చక్రవర్తి సాదరంగా అహ్వానం పలికారు. అనంతరం అన్ లైన్ మెడిసిన్ కు సంబంధించిన విషయాలను వారికి సిబ్బంది వివరించారు.

‘‘ మెట్రో మెడీ ఆన్ లైన్ ఫార్మసీ సంస్థలో చక్కనైన సాయంకాలం వేళ తమకు మర్చిపోలేని అతిథ్యం లభించిందని, వారికి ధన్యవాదాలు’’ అంటూ సైనా నెహ్వాల్ తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా తన ఫోటోలను పంచుకున్నారు. అదే సమయంలో ఇటు మెట్రోమెడీ సంస్థ కూడా తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా సైనా నెహ్వాల్ తో పాటు పారుపల్లి కశ్యప్ కు కూడా తమ కార్యాలయాన్ని విచ్చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను టీవీల్లో మాత్రమే చూసిన మెట్రోమెడీ సిబ్బంది నేరుగా చూసేసరికి ఆ దంపతులతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles