(Image source from: Indianexpress.com)
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి, చిన్న వాగులు వంకలు కూడా ప్రవహిస్తూన్నాయి. కుంటలు, చెరువులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇక వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఈ తరుణంలో భారతీయ వాతావరణ శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. గత వారం రోజులకు ముందుగా నగరంలో పది నుంచి పన్నెండు రోజుల పాటు వరుసగా కురిసిన వర్షంతో హుస్సేన్ సాగర్ కూడా ప్రమాదస్థాయికి నీరు చేరడంతో అధికారులు గేట్లు తెరచి నీటిని కిందకు వదిలిన విషయం కూడా తెలిసిందే.
ఈ తరుణంలో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనలతో భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిని సూచనలు చేసింది. అంతేకాదు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం వుందని.. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.
ఇక ఈ జిల్లాలతో పాటు నల్లగొండ, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండడంతోపాటు, రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వివరించారు. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more