Police awareness programme on posts in social media సోషల్ మీడియా పోస్టులపై రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

Rachakonda police awareness programme on posts in social media

Rachakonda Police, Fake News, Graphic Content, social media Videos, Social Media, Campaigng of fake video, panic in people

Rachakonda police commissionerate brings awarness programme to netizens on posts in social media. The cops explain on graphic works done in videos which are not to be true at all with such videos.

ITEMVIDEOS: సోషల్ మీడియా పోస్టులపై రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

Posted: 08/24/2020 09:08 PM IST
Rachakonda police awareness programme on posts in social media

సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, అదే స్థాయిలో దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫేక్ న్యూస్ అంశం సోషల్ మీడియాలో ఓ విపత్తులా పరిణమించింది. కొన్నిసార్లు ఫేక్ న్యూస్ వల్ల ఏది నిజం, ఏది అబద్ధం అని తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని జీవితాలు సైతం ఫేక్ న్యూస్ కారణంగా తీవ్ర ప్రభావాలకు లోనైన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలోని రాచకొండ కమిషనరేట్ పోలీసులు వినూత్న తరహాలో ప్రచారం ప్రారంభించారు.

ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు కొన్నివీడియోల సాయంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్టు నిజమే అని నమ్మవద్దు అని హితవు పలుకుతూ, రాచకొండ పోలీసులు తాజాగా ఓ వీడియో పోస్టు చేశారు.

అందులో రైలు పట్టాలపై సింహం పడుకుని ఉండగా, వేగంగా రైలు వస్తూంటుంది. చూసేవాళ్లకు ఆ రైలు సింహాన్ని తాకుతుంది అనిపించినా, అది గ్రాఫిక్స్ కావడంతో రైలు దానిపాటికి అది వెళ్లిపోతుంది. సింహం రైలు పట్టాలపై ఉన్నట్టు భ్రమించడానికి కారణం గ్రాఫిక్స్ అని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఫేక్ న్యూస్ కూడా ఇలాగే తయారుచేస్తారని, అదే నిజమని అనుకోరాదని రాచకొండ పోలీసులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles