మీకు పాన్ కార్డు వుందా..? అయితే మీ పాన్ కార్డు మార్చి 31 2021 నుంచి పనిచేయదు. ఔనా అని కంగారుపడుతున్నారా.? నిజమేనండీ.. మీ పాన్ కార్డుకు ఆ కార్డుతో లింక్ చేయకపోతే ఇక మీ వద్దనున్న పాన్ పనిచేయదు. ఏ కార్డుతో లింక్ చేయాలి అని అంటారా.? అదేనండీ ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయని పక్షంలో అది మార్చి 31, 2021 నుంచి పనిచేయదని ఆదాయ పన్నుశాఖ తేల్చిచెబుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పామని, అయినా చాలా మంది పెడచెవిన పెడుతున్నారని, అందుచేత ఏకంగా దేశంలోని 18 కోట్ల పాన్ కార్డులను రానున్న మార్చి 31 నుంచి పనిచేయబోకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారుటు,
ఇప్పటివరకు ఆధార్ తో లింక్ చేయని సుమారు 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని... గడువు ముగిసేలోగా లింక్ చేయకపోతే నిర్వీర్యం చేస్తామని ఆ శాఖ తెలిపింది. ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. కొందరు విలాసవంతంగా ఖర్చులు చేస్తూ... పన్నులను ఎగవేసేందుకు ఒకటి కన్న ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. పాన్ కార్డును ఆధార్తో లింక్ చేస్తే, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే అవకాశం ఉండదని.. అందుకే లింక్ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని వివరించారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచివల్ ఫండ్, క్రెడిట్-డెబిట్ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ లావాదేవీలను గుర్తించి... ఆ వ్యయాల తీరుపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. సుమారు 130 కోట్ల జనాభాలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారని ప్రధాని ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం.. ‘‘పారదర్శక పన్ను విధానం.. నిజాయితీపరులకు గౌరవం అని ఆదాయ పన్నుశాఖ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పన్ను చెల్లింపు కోసం ప్రజలు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ చర్యను దోహదపడనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more