కరోనా వైరస్ ప్రపంచ స్థితిగతులను మార్చేసింది. ప్రపంచ వేగానికి కళ్లాలను వేసి గమనాన్ని మందగించేలా చేసింది. మహమ్మారి విసరుతున్న సవాళ్లను అధిగమించి ప్రపంచం తన పయనాన్ని మళ్లీ ప్రారంభించింది. ఇటు మన దేశంలో సైతం ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాలని.. అంతేకానీ విపత్తు నేపథ్యంలో జీవిత పయనం ఎలా నిలుపుతామని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పటికే అన్నింటికీ వేసిన తాళాలు తెరుచుకుంటున్నాయి, ఈ క్రమంలో ఇక అన్ లాక్ 3.0 నుంచి సినిమా హాల్ సహా అన్ని తెరుచుకోబోతున్నాయి.
ఈ క్రమంలో కోవిడ్-19 నిబంధనలను తప్పక అమలుపర్చాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఇక ఈ తరహాలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తాజాగా కొత్త ఎన్నికల మార్గదర్శకాలను విడుదల చేసింది. చివరకు ఎన్నికల నిబంధనలు కూడా మారిపోతున్నాయి. వాటిలో భాగంగా ప్రచార కార్యక్రమాలు మొదలుకుని ఓటింగ్ కేంద్రాల్లో ఓటు వేసే వరకు అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇన్నాళ్లు హంగూ అర్భాటాల మధ్య వుండే ప్రచార కార్యక్రమాలు ఇక తక్కువ సంఖ్యకు పరిమితం కానున్నాయి, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని ఎన్నికల కమీషన్ తెలిపింది. ఓటు వేసే సమయంలో ఓటర్లు సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పింది.
ఓటర్లందరికీ గ్లవ్స్ ఇవ్వాలని... ప్రతి ఓటరు గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్ ను నొక్కాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని పేర్కొంది. పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని... అయితే, కేంద్ర హోంశాఖ విధించిన కోవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని ఆదేశించింది. అభ్యర్థులందరూ నామినేషన్లను ఆన్ లైన్లో దాఖలు చేయాలని ఈసీ తెలిపింది. సెక్యూరిటీ డిపాజిట్ ను కూడా ఆన్ లైన్లోనే చెల్లించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో మాస్కులు, శానిటైజర్లు ఉండాలని చెప్పింది. థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more