ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అన్ లాక్ వన్ ప్రారంభంతో రెక్కలు వచ్చిన ధరలకు విపక్షాల అందోళన నేపథ్యంలో కాసింత నెమ్మదించాయి, అయితే ప్రస్తుతం మరోమారు ఇంధన ధరలు పెరిగాయి. వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం లీటరు పెట్రోల్పై 10 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.81.06 కి చేరింది. గత ఐదు రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై 57 పైసలు పెంచాయి. దీంతో పలు నగరాల్లో పెట్రోల్ ధర ఏకంగా రూ.85ను అందుకునేందుకు పరుగులు తీస్తోంది,
మరోవైపు గత రెండు వారాలుగా డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.73.62గా ఉంది. పలు నగరాల్లో డీజిల్ ధర ఏకంగా రూ.82 దాటింది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటం.. బ్యారెల్ ముడి చమురు ధర 45 డాలర్లు దాటడం వల్ల దేశీయ చమురు సంస్థలు ధరల్లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 81.00గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 73.56కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 87.68గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 80.11కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 84.09గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 78.86కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 82.53గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 77.06కు చేరింది.
ఏపీలో లీటరు పెట్రోల్ ధర 76.07గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 70.67కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 84.43గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 80.10కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 84.18గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 80.17కు చేరింది.
దేశంలోని భూపాల్, అహ్మదాబాద్, నాగ్ పూర్, నాసిక్, ఇండోర్, జైపూర్ నగరాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.90 మార్కుకు చేరువలో వుంది. అదే విధంగా ఔరంగాబాద్, భూపాల్, భువనేశ్వర్, గువహటి, హైదారబాద్, ఇండోర్, ముంబై, నాగ్ పూర్, థానే, విశాఖపట్నం నగరాల్లో డీజిల్ ధర లీటరుకు ఎనబై రూపాయలు దాటగా, జైపూర్ లో మాత్రం ఏకంగా రూ.82 దాటింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more