రాజధాని విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానంలో మరోమారు తన వాదనను వినిపించింది కేంద్రం. ఈ విషయంలో ప్రభుత్వానికి, అమరావతి జేఏసీ నేతలకు మధ్య నడుస్తున్న కేసు నేపథ్యంలో కేంద్రం హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి మరోమారు న్యాయస్థానానికి క్లారిటీగా తమ వాదనను వినిపించారు. ఈ సందర్భంగా గతంలో చెప్పిన విషయాలను మరోమారు వెల్డడించారు. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ వాదనను వినిపించింది, ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈనెల 14న పేర్కొన్న అంశాలనే తాజాగా పునరుద్ఘాటించింది. కాగా, ఇటీవల ఏపీ గవర్నర్ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై హైకోర్టు స్టే కొనసాగుతోంది. ఈ నెల 27 వరకు ఈ రెండు బిల్లులపై స్టే కొనసాగుతుందని ఈ నెల 14 హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ఏర్పాటు అంశం తమ పరిధిలోనిది కాదని మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఈ నెల 28న మరోమారు రాష్ట్ర హైకోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో రాజధాని అంశంతో పాటు సీఆర్డీఏ అంశంపై కూడా ఆసక్తి నెలకోంది.
ఆంధ్రప్రదేశ్ లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ మళ్లీ వాయిదా పడింది. జస్టిస్ నారీమన్ ధర్మాసనం .. ఈ కేసును మరో బెంచ్కు బదిలీ చేయాలని ఆదేశించింది. రాజధాని రైతులు, ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు వినకముందే కోర్టులో చోటు చేసుకున్న ఒక పరిణామంతో ఈ కేసును వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ నారీమన్ ధర్మాసనం తెలిపింది. ఈకేసు మరో బెంచ్కు పంపాలని జస్టిస్ నారీమన్ .. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజధాని కోసం 33వేల ఎకరాల భూమి ఇచ్చామని, అమరావతి నుంచి రాజధాని మార్చి తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more