కరోనా వైరస్ నుంచి ఊరట పొందాలంటే తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలి. వారి చెప్పిన విధంగా మందులు వేసుకోవడం తప్పనిసరి. అయితే అనేక మంది హోం క్వారంటైన్ లో వున్న బాధితులు అవిరితో కరోనాను ఆవిరియ్యేట్టు చేశారని తాజాగా వైద్యుల పరిశీలనలో తేలింది. ఒక క్రమపద్ధతిలో రోజూ మూడుసార్లు ఆవిరి పట్టుకొంటే చాలా వరకు ప్రయోజనం ఉంటోందని తేలింది. ఇలా చేస్తూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్న వారు త్వరగా కోలుకుంటున్నట్లు హైదరాబాదులోని ప్రముఖ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స అందించే ప్రధాన వైద్యుడి పరిశీలనలో స్పష్టమైంది.
గ్రేటర్ హైదరాబాదు వ్యాప్తంగా ప్రస్తుతం 20 వేల మంది వరకు కరోనా బాధితులు ఉండగా 15 వేల మందికి పైగా ఇంట్లోనే వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషనో వున్న వారు ప్రతిరోజు వైద్యుల సూచనల మేరకు రోజుకు మూడు పూటలా అవిరి పట్టుకోవడంతో కరోనా నుంచి వేగంగా కోలుకున్నారని వైద్యుల పరిశీలనలో స్పష్టమైంది. దీనికి తోడు వైద్యులు సూచించిన మందులు తీసుకోవడంతో పాటు పండ్లు మరీ ముఖ్యంగా బత్తాయి, నారింజ సహా ఆపిల్, దానిమ్మను తీసుకోవడంతో వేగంగా కరోనా నుంచి విముక్తులు అవుతూ.. నెగిటివ్ రిపోర్టు తెచ్చుకుంటున్నారు.
అయితే హోం ఐసోలేషన్ లోని వారికి వైద్యసాయం సరిగా అందడం లేదని కూడా వీరి పరిశీలనలో బయటపడిందని సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, స్నేహితుల సలహాలు సూచనల ఆధారంగా కొందరు వైద్యం చేసుకుంటున్నారు. కొందరు అతిగా కషాయం తాగుతుండగా, మరికొంతమంది ఇష్టానుసారం మందులు వాడేస్తున్నారు. అప్పటికే చాలామంది ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆక్సిజన్ వెళ్లకుండా అడ్డుపడుతోందని వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి మరీ విషమిస్తే న్యూమోనియాకు దారితీస్తోంది. ఇలాంటి వారికి తొలుత ఆక్సిజన్ తరువాత వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది.
కరోనా సోకిన వారు ఆది నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడడంతోపాటు రోజూ మూడు పూటలా 15 నిమిషాలపాటు ఆవిరి పడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. పాత్రలో మరిగించిన నీటిలో ట్యూబ్ మందు గానీ పసుపు గానీ వేసి పావు గంట సేపు ఆవిరి పీల్చాలని సూచిస్తున్నారు. తద్వారా రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. శ్వాస ప్రక్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది. ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపడుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more