Covid 19: 9024 fresh cases reported in AP ఏపీలో 24 గంటల్లో 9024 కేసులు.. 87 మరణాలు

Coronavirus in ap 9024 new covid 19 cases state tally nears 2 5 lakh mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 2,44,549 Mark after 9024 new cases were reported in the last 24 hours, out of which 1,54,749 have so far recovered and have been discharged, while 2203 have died, the state health department said.

ఏపీలో కరోనా విజృంభన: 24 గంటల్లో 9024 కేసులు.. 87 మరణాలు

Posted: 08/12/2020 12:50 AM IST
Coronavirus in ap 9024 new covid 19 cases state tally nears 2 5 lakh mark

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా రెండు లక్షల నలభై ఐదువేల మార్కుకు చేరువలో వున్నాయి, ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఏడు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. ఇవాళ కూడా సుమారు ఏడు వేల మార్కును అధిగమించాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా రెండు లక్షల 45 వేల మార్కుకు చేరువలో నమోదయ్యాయి. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

ఇటీవల రోజరోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏడు వేల పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తమైంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా రెండు లక్షల 45 వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 9024 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 2,44,549 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.

ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి,  కర్నూలు, అనంతపూర్, చిత్తూర్ జిల్లాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా పదమూడు వందల సంఖ్యలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదు కావడం.. దీంతో పాటు మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం అక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 959, చిత్తూరు జిల్లాలో 758, తూర్పు గోదావరి జిల్లాలో 1372, గుంటూరు జిల్లాలో 717, కడప జిల్లాలో 579, కృష్ణా జిల్లాలో 342, కర్నూలు 1138. నెల్లూరు జిల్లాలో 364, ప్రకాశం జిల్లాలో 343 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 504, విశాఖపట్నం జిల్లాల్లో 676, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 678 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి,

వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 87 మంది అసువులు బాసారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి,  

అనంతపురం జిల్లాలో పదమూడు మంది; చిత్తూరు జిల్లాలో పన్నెండు మంది; గుంటూరులో తొమ్మిది; ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు; కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు; తూర్పు గోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణ, కర్నూల్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2,203కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  1,54,749 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 87,597 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles