students worry over versities decision of conduct of exams ప్రభుత్వాల ప్రకటన.. వర్శిటీల నిర్ణయాలతో విద్యార్థుల్లో ఆందోళన

Telangana promoted students worry over versities decision of conduct of exams

Telangana Engineering students, Telangana MBA students, Telanagana MCA students, Telangana Pharmacy students, Telanagana professional graduate students, Telangana under graduates, Osmania University, promoted students, Universities, university students, JNTUH University, Telangana

While the students of final year are trying to reach the prime minister for his interference in conducting the university exams risking their lives, the Universities decided to conduct the exams for the promoted students during the next academic year. This makes telangana students tensed and unhappy over varsitiess decision on conduct of exams.

ప్రభుత్వాల ప్రకటన.. వర్శిటీల నిర్ణయాలతో విద్యార్థుల్లో ఆందోళన

Posted: 07/27/2020 02:13 PM IST
Telangana promoted students worry over versities decision of conduct of exams

కరోనా మహమ్మారి నేపథ్యంలో, అన్ని రకాల పరీక్షలు వాయిదా పడగా, గత విద్యాసంవత్సరంలో విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఫైనలియర్ పరీక్షలు మాత్రం జరుగుతాయని ఇప్పటికే స్పష్టతను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే దీనిపై చివరి విద్యా సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఓ పిటీషన్ తయారు చేసి దానిని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అన్ని రాష్ట్రాల చివరి విద్యా సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, ఇక మరికొంత మంది ఈ విషయంలో ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపును కూడా తట్టారు.

అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థులు అటు ప్రధాని దృష్టికి ఇటు న్యాయస్థానంలో పోరాటానికి సిద్దమవుతున్న క్రమంలో యూనివర్సిటీలు కూడా తాజాగా తమ రూటు మార్చాయి. మిగతా సంవత్సరాల విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయినప్పటికీ, వారంతా పరీక్షలు రాయాల్సి వుంటుందని ఉస్మానియా, జేఎన్టీయూ తదితర తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఫైనలియర్ విద్యార్థులు మినహా మిగతా అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, వర్శిటీలు మాత్రం పరీక్షల విషయంలో రెండు ఆప్షన్లు ఇస్తున్నాయి. ఫైనలియర్ పరీక్షలు ముగిశాక, మిగతా పరీక్షలను నిర్వహిస్తామని అంటున్నాయి.

రెండో ఆప్షన్ గా, విద్యా సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా పరీక్షలు పెడతామని చెబుతున్నాయి. ఈ రెండు విధానాల్లో ఏదో ఒకదాన్ని అమలు చేస్తామని, అయితే, ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారమే నిర్ణయం ఉంటుందని వెల్లడించాయి. కాగా, ఆగస్టు నుంచి వర్శిటీల పరిధిలో ఆన్ లైన్ క్లాసులు, ఆపై పరిస్థితి చక్కబడిన తరువాత ప్రత్యక్ష క్లాసులను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. అయితే సెమిస్టర్ ప్రారంభించిన తరువాత, అంతకుముందు సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను విద్యార్థులు రాయాల్సి వుంటుందని జేఎన్టీయూ, ఉస్మానియా ఉన్నతాధికారులు అంటున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ లో పరీక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పై తరగతులకు ప్రమోట్ అయ్యే విద్యార్థులకు ఈ దఫా క్రెడిట్ డిటెన్షన్ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles