కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ.. పలు రాష్ట్రాల్లో అధికారంలో వున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలను కూలదోసి.. ఫిరాయింపులకు ఉసిగోల్పుతూ తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తొందని ఈ తరుణంలో దమ్ముంటే మహారాష్ట్రలోని తమ ప్రభుత్వాన్ని కూల్చాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. బీజేపీతో తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని, తమ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది.
మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడం, రాజస్థాన్లో అస్థిరతపై ఆయన స్పందిస్తూ... పై వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలసి రాష్ట్ర పరిస్థితులపై అద్యయనం చేసిన తరువాత ఇక తదుపరి టార్గెట్ మహారాష్ట్రే అని వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఉద్దవ్ థాకరే వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ రోజు మనం చైనాను వ్యతిరేకిస్తున్నాం. కానీ... రాబోయే రోజుల్లో చైనా- భారత్ మిత్ర దేశాలుగా మారొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై మనం మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరింత స్పష్టత రావాల్సి ఉంది’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి విజృంబిస్తూ దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో జడలు విప్పుతూ ప్రభావానికి గురిచేస్తున్న క్రమంలో ప్రజారోగ్యానికే తాము పెద్ద పీట వేస్తామే తప్ప.. ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసేందుకు తాను సుముఖంగా లేనని ఉద్దవ్ థకరే తేల్చిచెప్పాన్నారు. మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థల మధ్య సమతూకం సాధించడం అవసరమని పేర్కొన్నారు.
‘పూర్తిగా లాక్డౌన్ ఎత్తేస్తానని నేనెప్పుడూ అనలేదు. కొద్దికొద్దిగా తెరుద్దామని చెప్పాను. ఒకసారి తెరిచాక మళ్లీ మూసేయొద్దన్నది నా ఉద్దేశం. దశలవారీగా వ్యాపారాలను తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాను. ఆర్థిక వ్యవస్థా, ఆరోగ్యమా అని ఆలోచించకూడదు. రెండింటి మధ్య సమతూకం అవసరం. ఈ మహమ్మారి ప్రపంచ యుద్ధంలాంటిది. అన్ని దేశాలూ దీని బారిన పడ్డాయి. వైరస్ ప్రభావం పోయిందని ఆర్థిక వ్యవస్థలు తెరిచిన దేశాలు ఇప్పుడు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో సైన్యాన్ని రంగంలోకి దించారు’ అని ఉద్దవ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more