తెలంగాణ ప్రభుత్వంపై మరోమారు అక్షింతలు వేసింది రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు. ఇదే చివరి అవకాశమని ఇప్పటికైనా మార్పులు, చేర్పులు లేకుండా అసంపూర్తి వివరాలతో ముందుకెళితే తీవ్ర చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. కరోనా బులిటెన్ విడుదల విషయంలో న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలను అమలు పర్చాలని అదేశించింది. అందుకు ఇదే చివరి అవకాశంగా భావించాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇవాళ విచారించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి న్యాయస్థానం అల్టిమేటం జారీచేసింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.
కరోనా బులెటిన్ విడుదల విషయంలో కోర్టు జారీ చేసిన అదేశాలను ఉల్లఘనకు పాల్పడి న్యాయస్థానం సహనాన్ని పరీక్షించవద్దని చెప్పింది. ఈ విషయంలో తప్పక చర్యలు తీసుకోవాలని ఇదివరకే అదేశించిన న్యాయస్థానం తమ అదేశాలు అమలు చేయడంలో జాప్యానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఈ నెల 28న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులను న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కరోనావైరస్ నేపథ్యంలో ప్రభుత్వ అరోగ్యశాఖ ప్రతిరోజు విడుదల చేస్తున్న బులిటెన్ లో సమగ్ర వివరాలు ఉండేలా చూడాలని సూచించింది.
కలెక్టర్లు జిల్లాల వారీగా కరోనా కేసులు, ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలు, రాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే విషయాలను వెల్లడించాలని సూచించింది. వైద్యారోగ్యశాఖ వెబ్ సైట్ ను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరును విస్తృత ప్రచారం చేయాలి. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలి. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలి. కరోనా నియంత్రణ ప్రభుత్వం, అధికారుల రాజ్యాంగ బద్ధమైన విధి. దానిని విస్మరించరాదు’’ అని కోర్టు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more