(Image source from: Telugu.samayam.com)
వైసీపీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు తమ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను పార్టీలోకి రమ్మని ప్రాధేయపడితే కానీ తాను రాలేదని.. అలాంటిది తనపైన ఏకంగా రాష్ట్రానికి చెందిన ఓ అమాత్యుడితో కేసులు వేయించడం, తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో దూషణల పర్వానికి తెరలేపడంపై ఇదివరకే తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. తనపై విమర్శలు చేయించడానికి తన సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఎంచుకుని మరీ చేయించడం విషసంస్కృతిగా ఆయన చెప్పుకోచ్చిన తరువాత పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక వైసీపీ పార్టీని విశ్వసించడం గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.
ఇక తన నియోజకవర్గంలో తిరిగేందుకు కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే తమకు అవగాహన ఉందని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుందని, దీనిపై కేంద్ర హోంశాఖ నిమగ్నమైందని న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం ఐబీ నివేదికలు రావాలని, వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే రెండు వారాల్లో దీనిపై ఏం చేశారనేది కోర్టుకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.
ఈ విషయంలో ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు గతంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర హోంశాఖకు కూడా ఆయన లేఖ రాశారు. అయితే ఎంపీ రాఘురామ కృష్ణంరాజుకు తాము భద్రత కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీంతో కేంద్రం కొంత జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కోర్టు ద్వారా కేంద్రానికి ఆదేశాలు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రఘురామకృష్ణం రాజు కోర్టునే ఆశ్రయించినట్లు సమాచారం. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. తనపై ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రే కేసులు పెట్టారని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతోనే తనకు ఇబ్బంది ఉందని ఉందన్నారు. ఒక వేళ ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లే ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నట్లు ఎంపీ రఘురామ చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్న ఆయన.. తాను వైఎస్సార్ సీపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికే సలహాలు ఇస్తున్నట్లు రఘురామ చెప్పుకొస్తున్నారు. యావత్ ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలకు ఎలాంటి గాయం కాకూడదనే తాను తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం విషయమై స్పందించానని చెప్పారు. ఈ విషయంలో తన గళం వినిపించినే కానీ.. పార్టీని కానీ, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కానీ తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని అన్నారు. ఈ తరుణంలో ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more