Police exchange fire with Maoists in Telangana కుమరం భీం అడవుల్లో ఎదురుకాల్పులు

Police exchange fire with maoists near telangana village

Maoists, Exchange of fire, Thokkuguda village, Thiryani Mandal, Kumaram Bheem Asifabad district, Adilabad news, Nirmal district, Telangana

An exchange of fire took place between the Special Police party and the outlawed Maoists in the forest near Thokkuguda village of Thiryani Mandal in Kumaram Bheem Asifabad district. No casualties or injuries were reported from both the sides and the armed men of banned CPI (Maoist) slipped into the deep forest.

కుమరం భీం అడవుల్లో హై-అలర్ట్.. మావోలు, పోలీసులకు మద్య ఎదురుకాల్పులు

Posted: 07/15/2020 12:29 PM IST
Police exchange fire with maoists near telangana village

(Image source from: Ndtv.com)

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలొ హైఅలర్ట్ నెలకొంది. జిల్లాలోని తిర్యాణి మండలం మాంగీ అటవీ ప్రాంతంలో పోలీసులు, బహిష్కృత సిపీఐ(మావోయిస్ట్) సభ్యులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి, మండలంలోని తుక్కుగూడ గ్రామంలో కూంబింగ్ చేస్తున్న పోలీసుల ప్రత్యేక బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు, దీంతో ఇరువర్గాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులకు తారసపడిన ముగ్గురు మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో పోలీసులపైకి కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి పోలీసు బలగాలు కూడా ధీటుగానే సమాధానమిచ్చాయి.

మావోలతో తలపడి వారిపై పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపారు. అయితే దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిన మావోలు తప్పించుకున్నారని పోలీసుల బలగాలు తెలిపాయి. ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఇరువర్గాల నుంచి ఎలాంటి ప్రాణనష్టం లేదని, గాయలు కూడా కాలేదని సమాచారం, గత అదివారం పోలీసుల బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో వారికి భారీ మావోల డంప్ లభించింది. అందులో ముఖ్యమైన డాక్యూమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు లభించాయి, దీంతో స్థానిక మావో దళ నాయకుడైన మైలారపు అదేలు అలియాస్ భాస్కర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

అదేలు పట్టించిన వారికి లేదా అతని సమాచారం అందించినవారికి రూ.25 లక్షల రివార్డును ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింంది. పలు కీలక ఘటనల్లో అదేలు పాల్గోనడంతో ఆయనపై  ఈ రివార్డును ప్రకటించిందీ ప్రభుత్వం. ఈ డంప్ ద్వారా లభ్యమైన సమాచారంతో గత మూడు రోజులుగా పోలీసులు మాంగీ, గుండాల, పంకిడి మాదర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles