(Image source from: Ndtv.com)
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలొ హైఅలర్ట్ నెలకొంది. జిల్లాలోని తిర్యాణి మండలం మాంగీ అటవీ ప్రాంతంలో పోలీసులు, బహిష్కృత సిపీఐ(మావోయిస్ట్) సభ్యులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి, మండలంలోని తుక్కుగూడ గ్రామంలో కూంబింగ్ చేస్తున్న పోలీసుల ప్రత్యేక బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు, దీంతో ఇరువర్గాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులకు తారసపడిన ముగ్గురు మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో పోలీసులపైకి కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి పోలీసు బలగాలు కూడా ధీటుగానే సమాధానమిచ్చాయి.
మావోలతో తలపడి వారిపై పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపారు. అయితే దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిన మావోలు తప్పించుకున్నారని పోలీసుల బలగాలు తెలిపాయి. ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఇరువర్గాల నుంచి ఎలాంటి ప్రాణనష్టం లేదని, గాయలు కూడా కాలేదని సమాచారం, గత అదివారం పోలీసుల బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో వారికి భారీ మావోల డంప్ లభించింది. అందులో ముఖ్యమైన డాక్యూమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు లభించాయి, దీంతో స్థానిక మావో దళ నాయకుడైన మైలారపు అదేలు అలియాస్ భాస్కర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
అదేలు పట్టించిన వారికి లేదా అతని సమాచారం అందించినవారికి రూ.25 లక్షల రివార్డును ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింంది. పలు కీలక ఘటనల్లో అదేలు పాల్గోనడంతో ఆయనపై ఈ రివార్డును ప్రకటించిందీ ప్రభుత్వం. ఈ డంప్ ద్వారా లభ్యమైన సమాచారంతో గత మూడు రోజులుగా పోలీసులు మాంగీ, గుండాల, పంకిడి మాదర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more