Covid 19: 1916 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 1916 కేసులు.. 43 మరణాలు

Coronavirus in ap 1916 new covid 19 cases state tally crosses 33 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 33000 Mark after 1916 new cases were reported in the last 24 hours, out of which 17,467 have so far recovered and have been discharged, while 408 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. 33 వేలు ధాటిన కేసులు.. 408 మరణాలు

Posted: 07/14/2020 03:34 PM IST
Coronavirus in ap 1916 new covid 19 cases state tally crosses 33 thousand mark

(Image source from: Hindustantimes.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు 33 వేల మార్కుకు అధిగమించాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు వెయి మార్కుకు అటు ఇటుగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా 33 వేల మార్కును అధిగమించింది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ వెయ్య సంఖ్యకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో రెండు వేల సంఖ్యకు చేరువలో కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య ఏకంగా ముఫై మూడు వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 1916 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 33,019 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య లేకపోయినా.. ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో మాత్రం 1916 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా ఆనంతపురంలో 185, చిత్తూరు జిల్లాలో 238, తూర్పు గోదావరి జిల్లాలో 160, గుంటూరు జిల్లాలో 146, కడప జిల్లాలో 112, కృష్ణా జిల్లాలో 129, కర్నూలు 169. నెల్లూరు జిల్లాలో 165, ప్రకాశం జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 215, విశాఖపట్నం జిల్లాల్లో 28, విజయనగరంలో 130, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 43 మంది అసువులు బాసారు. మృతుల్లో అనంతపూర్‌లో 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, కడపలో 5, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతి చెందారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 408కి చేరింది. కాగా రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల నుంచి ఇవాళ పలువురు కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు. వీరిని వైద్యాధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 17,467కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 15,144కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 432గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2424కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles