కరోనా సంక్షోభంతో ఉన్న కొలువులు ఊడిపోతున్నాయన్నా దిగులు ఉద్యోగులందరిలోనూ నెలకొంది. ఇక కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలు ఊడిపోకుండా చూసుకోవాలన్న జాగ్రత్త కూడా అధికంగా మారింది. అయితే ఇటువంటి సంక్షోభ సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగ యువతకు బంఫర్ ఆపర్ ప్రకటించింది. మరీ ముఖ్యంగా దేశీయ బిటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదెలా అంటే కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు దేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిద్ధమైంది. ఈ సంవత్సరం కూడా క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా 40,000 మంది ఫ్రెషర్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని టిసిఎస్ నిర్ణయించింది.
ఇంజనీర్లతో పాటు, సంస్థ టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా తీసుకోనుంది. గత సంవత్సరం కూడా భారత్ లో టిసిఎస్ 40 వేల మందిని క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా జూన్ త్రైమాసికంలో టిసిఎస్ ఆదాయం బాగా పడిపోయింది. అయినప్పటికీ, ఈసారి(2020) కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 40 వేల మందిని నియమించాలని కంపెనీ నిర్ణయించింది. టీసీఎస్ ఈవీపీ& గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ…భారతదేశంలో మేము 40 వేల నియామకాలు చేస్తాము. ఈ సంఖ్య 45 వేలు కూడా కావచ్చు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ అవుతుంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వ్యాపారం తిరిగి ట్రాక్లోకి వస్తుందని కంపెనీ ఆశిస్తోంది అని అయన తెలిపారు.
అలాగే, ఈ ఏడాది యుఎస్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా సుమారు 2000 మంది నియమించాలని కంపెనీ యోచిస్తోంది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు. H-1B మరియు L-1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఆ వీసాలను ఇప్పుడు అమెరికా రద్దు చేసింది. 2014 నుండి 20,000 మందికి పైగా అమెరికన్లను నియమించుకున్నట్లు లక్కడ్ గుర్తు చేశారు. హెచ్ -1 బి, ఎల్ -1 వర్క్ వీసాలను నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, అన్యాయమని లక్కడ్ పేర్కొన్నారు. ఇది స్వల్పకాలిక ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. ఇది ఉద్యోగులలో అనిశ్చితి మరియు ఆగ్రహాన్ని కలిగించిందని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more