(Image source from: Ntnews.com)
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు (మంగళవారం) రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి వర్షాల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశాలు వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇక దీంతో పాటు రాగల రెండ్రోజులు గ్రేటర్ హైదరాబాద్ లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలో నైరుతి పవనాలు చరుగ్గా కదులుతున్నాయి ఇప్పటికే ఇవి దేశవ్యాప్తంగా విస్తరించబడ్డాయని అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవాకశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి.
ఆగ్నేయ ఉత్తర్ ప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్ గడ్ వరకూ ఉత్తర్-దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు వున్నాయని తెలిపింది. ఇక వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు తోడు కరోనా మహమ్మారి కూడా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు తమ అరోగ్యాలను సురక్షింగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more