Coronavirus: India reports record 22,771 cases in a day దేశంలో 7.5 లక్షల చేరువలో కేసులు.. 20 వేల మరణాలు

Coronavirus cases in india tally nears 7 5 lakh nearly 21000 dead

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

With a record 22,752 coronavirus cases reported in the past 24 hours, the total count in India has risen to 7,42,417. The death toll has gone up to 20,642 as Covid-19 claimed 482 lives in 24 hours. According to Health Ministry figures released today morning, 4,56,831 have recovered so far while there are 2,64,944 active cases in the country.

దేశంలో కరోనా విజృంభన: వారం రోజులుగా 22 వేలకు పైబడిన కేసులు..

Posted: 07/08/2020 12:41 PM IST
Coronavirus cases in india tally nears 7 5 lakh nearly 21000 dead

(Image source from: Firstpost.com)

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా మరింత అత్యధిక స్థాయిలో కేసులు నమోదుచేసుకుంది. గత వారం రోజులుగా 22 వేల మార్కుకు పైబడిన కేసులు నమోదువుతుండగా, తాజాగా ఇవాళ సుమారు 23 వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఓ వైపు తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూ ఏకంగా ఏడు లక్షల మార్కును అధిగమించింది. అదే సమయంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.

రోజురోజుకూ తనవ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో మూడవ స్థానంలో భారత్ నిలిచింది. ఈ స్థానంలో నిలిచిన రష్యాను వెనక్కి నెట్టి భారత్ అంతకుమించిన కేసులను నమోదు చేసుకుంది. దీంతో కరోనా కేసులలో అత్యధిక స్థాయిలో నమోదు చుసుకున్న అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తరువాత బ్రెజిల్, ఆ తరువాత భారత్ కోనసాగుతున్నాయి. భారత్ తరువాత రష్యా ఆరు లక్షల ఎనభై వేల కేసులతో నాల్గవ స్థానంలో కోనసాగుతోంది. కాగా తాజాగా నమోదైన 24 వేల కేసులతో భారత్ రష్యాను అధిగమించి ఏకంగా 7.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులను నమోదు చేసుకునేందుకు చేరవలో వుంది. ఇక దేశంలో మరణాలు కూడా ఏకంగా 20 వేల మార్కును దాటేసాయి. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన ఏనమిదవ దేశంగా నమోదైంది.

గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చిన జులై 1 నుంచి రోజుకు ఇరవై వేలకు పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కాగా, తాజాగా ఇవాళ 23 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో క్రమంగా జడలువిప్పుతున్న కరోనా మహమ్మారి ఏకంగా 7 లక్షల మార్కును అధిగమించింది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఏకంగా లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు నాలుగు వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 482 మరణాలు నమోదయ్యాయి,

దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 1.0 తలుపులు తెరవగా, అన్ లాక్ 2.0తో రాకపోకలపై ఎలాంటి అంక్షలు లేకుండా చేసింది. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 22,752 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 7,42,417 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లోనే నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 482 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య ఇరవై వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన మరణాల సంఖ్య ఏకంగా 19,693కు చేరింది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 4,56,831 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 2,64,944 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 60 శాతంగా నమోదైంది.

మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా ఉద్దృతి భారీగా పేరుగుతోంది. దేశంలో నమోదైన మొత్తంలో ఆరున్నర లక్షల కరోనా కేసులలో సమారు మూడు లక్షల కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇక దేశంలోని మరణాలలోనూ ఈ రెండు రాష్ట్రాల నుంచే అధికం. మహారాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండం చేస్తుండంతో అక్కడి సామాన్య ప్రజల జీవినం స్థంభించింది. మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా మహమ్మారి తన పంజాను విసురుతూ వేలాది మందిపై ప్రభావాన్ని చూపుతోంది. ఇక తాజాగా తమిళనాడులోనూ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. దీంతో దేశంలో లక్షకు పైగా కరోనా కేసుల నమోదు చేసుకున్న రెండో రాష్ట్రంగా మారింది. తమిళనాడుతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles