సరిహద్దుల్లో అహర్నిశలు మీరు కాపలాకాయబట్టే యావత్ దేశం నిశ్చింతగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ జవాన్ల సేవలను కోనియాడుతూ వారికి ప్రేరణ కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులు లడ్డాక్ ఘటన ద్వారా ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించామని కొనియాడారు. అదే సమయంలో చైనాకు ధీటైన జవాబు ఇచ్చేలా కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందని అన్నారు. ఇంతకాలం విస్తరణకాంక్షతో దూసుకెళ్లిన శక్తులు కూడా తమ నిర్ణయాలను ఉపసంహరించుకున్నాయని అన్నారు. అలా కానీ పక్షంలో ఓటములు ఇచ్చిన గుణపాఠాలతో వెనక్కి తగ్గాయని అందుకు చరిత్ర సాక్షాత్కరంగా నిలుస్తోందని అన్నారు. ప్రస్తుతం దేశాలన్నీ అభివృధ్దీలో పోటీపడుతూ పనిచేస్తున్నాయని, విస్తరణ ఇది సమయం కాదని చైనాకు పరోక్షంగా చురకలంటించారు.
వాస్తవాధీన రేఖ వెంట దురాక్రమణకు పాల్పడుతూ, సరిహద్దు వివాదాలను సృష్టిస్తోన్న చైనాకు ఈ వ్యాఖ్యల ద్వారా దీటైన సందేశాన్ని పంపించారు. లడాఖ్ లో పర్యటించిన ప్రధాని సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. గల్వాన్ ఘటనలో శత్రువులకు మీ పరాక్రమం చూపించారని అన్నారు. ఈ సందర్భంగా గల్వాన్ ఘటనలో అమరులైన సైనికులకు ప్రధాని మరోసారి నివాళులర్పించారు. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు భారత సైనిక బలగాలతో ఉన్నాయని అన్నారు. భారత సైన్యం శౌర్య పరాక్రమాల గురించి దేశంలో ఇంటింటా మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీకని.. విఛ్చిన్న శక్తుల కుట్రలను లడాఖ్ స్థానిక ప్రజలు తిప్పికొట్టారు.
14 దళాలకు చెందిన సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. సైన్యం సాహస గాథలు దేశంలోని ప్రతి ఇంటిని చేరాయని చెప్పారు. శత్రువులకు సైన్యం పరాక్రమ జ్వాల ఏంటో చూపించారని ప్రధాని సైనికుల ధైర్య సాహసాల్ని కొనియాడారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో భారత సైనికుల సాహస గాథల గురించి మాట్లాడుకుంటున్నారని ప్రధాని మోదీ సైనికులను కొనియాడారు. అంతేకాకుండా, వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను తిప్పికొట్టిన మన సంకల్పం ఎంతో గొప్పదని అన్నారు. ప్రస్తుతం భారత్ శక్తి సామర్థ్యాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్ష విభాగాల్లో మన శక్తి సమున్నతమని అన్నారు. ధైర్య సాహసాలతోనే శాంతి లభిస్తుందని, బలహీనులు ఎప్పటికీ శాంతిని సాధించలేరని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
ప్రపంచ యుద్ధాల్లోనైనా, ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయుల ధైర్యసాహసాల్ని చూసింది. మనం వేణువు ఊదే కృష్ణుడిని పూజిస్తాం.. అలాగే సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడినీ ఆరాధిస్తాం. సామ్రాజ్యవాద శకం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్లో పర్యటిస్తున్న విషయం తెలియగానే చైనా ఉలిక్కిపడింది. ప్రధాని పర్యటనపై వెంటనే చైనా విదేశాంగశాఖ స్పందించింది. 'సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇప్పటికే ఇరుదేశాలు సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లో ఎవ్వరూ పాల్గొనకూడదు' అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ప్రకటించారు. మోదీ లద్దాఖ్ పర్యటనపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more