(Image source from: Thehansindia.com)
తెలంగాణలో కరోనా విజృంభన యధేశ్చగా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ జిల్లాల్లో కరోనా వైరస్ జడలు విప్పి కరాళనృత్యం చేస్తోంది. తెలంగాణలోనికి కరోనా మహమ్మారిని రానీయం.. లేదా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టైనా వైరస్ వ్యాప్తి చెందకూండా చర్యలు తీసుకుంటామని సాక్షత్తు అసెంబీల్లోనే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఏకంగా కరోనా రాష్ట్రంలో తన ఉద్దృతిని కనబరుస్తోంది. ఇక తాజాగా నేరుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్ నే టార్గెట్ చేసుకుని మరీ వచ్చేసింది.
జూలై లేదా ఆగస్టులో కరోనాకు వాక్సీన్ వచ్చేస్తుందని స్వయంగా ముక్యమంత్రి కేసీఆర్.. కరోనా వైరస్ గణంకాల వివరాలను రాష్ట్ర ప్రజలకు వెల్లడిస్తూ మీడియా ముఖ్యంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కరోనాకు మందును మాత్రమే ఇప్పటికీ ఫార్మ కంపెనీలు తీసుకువచ్చాయి. కానీ వాక్సీన్ రావాలంటే మాత్రం మరి కోంత సమయం పట్టనుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఈ విషయం స్పష్టం చేస్తూ వాక్సీన్ వచ్చేందుకు మరో ఏడాది కాలం పడుతుందని కూడా స్పష్టం చేసింది. కానీ కరోనా మాత్రం ఎవ్వరినీ వదలడం లేదు.. రాజకీయ సినీ క్రీడా వర్గాలు ఎవ్వరూ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీని బారిన పడక తప్పడం లేదు.
తాజాగా కరోనా నేరుగా ప్రగతి భవన్ కు వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న 15 మంది పోలీసులకి కరోనా సోకింది. సోకిన వారిలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు, నగర పోలీసులు ఉన్నారు. బాధితులంతా కార్యాలయం బయట సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అందరికీ టెస్టులు నిర్వహిస్తున్న నేపద్యంలో 15 మంది పోలీసులకి కరోనా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారందరి వివరాలు సేకరించిన అసుపత్రులకు తరలించిన అధికార వర్గాలు.. వారి గత వారం రోజులుగా ఎవరెవరిని కలిశార్న వివరాలను కూడా సేకరించే పనిలో వున్నారు.
పాజిటివ్ గా నిర్థారణ అయిన పోలీసులందరినీ క్వారంటైన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపద్యంలో యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్లో మరో 11 మందికి కరోనా సోకింది. కాగా, గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. సీనియర్ అధికారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకిందని సమాచారం. ఈ నెల 7వ తేదీని కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీతో ఆయనను క్వారంటైన్ కు తరలించిన అధికారులు కార్యాలయంలో సానిటైజేషన్ చేసి.. వైరస్ ప్రభలకుండా రసాయనాలు చల్లి శుభ్రం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more