ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. విశాఖ జిల్లా ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలీమర్స్ సంస్థ లాక్ డౌన్ ముగిసిన తరువాత పరిశ్రమను తెరిచే క్రమంలో తెల్లవారుజామునే గ్యాస్ లీక్ అయ్యి ఏకంగా 13 మందిని కబళించి.. వందలాది మందిని అస్వస్థతకు గురిచేసిన ఘటనను మరువక ముందే మరోమారు అలాంటి వార్తే వినబడటంతో రాష్ట్రం ఉలిక్కపడింది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీపై ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనతో హతాశుయులైన సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో పరిశ్రమలోని డిస్టిలరీ విభాగంలో అమోనియా నుంచి కార్బన్ డయాక్సైడ్ తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పైప్ లీకేజ్ కారణంగా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు గ్యాస్ పీల్చుకుని ఊపిరాడక మరణించారు. అయితే మరో ముగ్గురు మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్లీకైన సమయంలో పరిశ్రమలో కేవలం ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. అయితే గ్యాస్ లీక్ కాగానే మేనేజర్ మినహా మిగిలిన నలుగురు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయినా ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.
గ్యాస్ లీక్ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలో్కి దిగారు. వీరితో పాటు జిల్లా యంత్రాంగం కూడా హుటాహుటిన రంగంలోకి దిగి అస్వస్థతకు గురైనవారి స్థానిక అసుపత్రులలో చేర్పించింది. ఆర్డీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రవికుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ పరిశీలించారు. గ్యాస్ పైప్ వెల్డింగ్ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఇక అస్వస్థతకు గురూన ముగ్గురు పరిస్థితి కూడా కుదుటపడిందని అన్నారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందని అన్నారు.
(Video Source: ABN Telugu)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more