దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర రైల్వేశాఖ బాటలోనే విమానయానశాఖ కూడా పయనిస్తోంది. సాధారణ ప్రయాణికులకు మెయిల్, ఎక్స్ ప్రెస్; ప్యాసింజర్, సబర్బన్ రైళ్లను రద్దు ఆగస్టు 12వ తేదీ వరకు రద్దు చేసిన రైల్వేశాఖ అడుగుజాడల్లోనే విమానయాన మంత్రిత్వ శాఖ కూడా పయనిస్తూ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రితం రోజున జులై 1 నుంచి ఆగస్టు 12 వరకు సాధారణ రైళ్ల ప్రయాణాలు అందుబాటులో వుండవని స్పష్టం చేసింది. ఇక ఈ మధ్యకాలంలో ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు అవుతాయని రైల్వే బోర్డు ప్రకటనలో వెల్లడించింది.
తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును మరికోంత కాలం పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30తో ముగుస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును మరోమారు జులై 15 వరకు పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ షరతులు అంతర్జాతీయ కార్గో విమానాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిపే విమానాలకు వర్తించవని స్పష్టంచేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 23 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయగా, మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను కేంద్రం కొనసాగిస్తోంది.
ఇక అటు రైల్వే సర్వీసులు విషయంలో మాత్రం మార్చిలో విధించిన లాక్ డౌన్ నుంచి నిలిచిపోయిన సేవలు ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దును జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ మరోసారి రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్డౌన్ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వసల కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరికొన్ని రైళ్లు మాత్రం యథాతథంగా నడవనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more