Petrol price hiked by 20 paise per litre, diesel by 55 paise వరుసగా పదిహేడవ రోజు బాదేసిన ఇం'ధన' సంస్థలు..

Petrol price hiked 20 paise diesel 55 paise in 17th consecutive price hike

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

Petrol price on Tuesday was hiked by 20 paise per litre and diesel by 55 paise as the oil companies increased prices for the 17th day in a row that took the cumulative increase to a steep Rs 8.5 and Rs 10.01 per litre, respectively. Petrol price in Delhi was hiked to Rs 79.76 per litre from Rs 79.56, while diesel rates were increased to Rs 79.40 a litre from Rs 78.55.

రెండేళ్ల గరిష్టస్థాయికి పెట్రోల్.. రికార్డు ధరకు ఎగసిన డీజిల్..

Posted: 06/23/2020 03:07 PM IST
Petrol price hiked 20 paise diesel 55 paise in 17th consecutive price hike

అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పేరుతో రోజూవారీగా ఇంధన సంస్తలు పెంచుతున్న ధరలు ఏకంగా రెండేళ్ల గరిష్టస్థాయిని కూడా అందుకుని మరింతపైకి ఎగబాకుతున్నాయి. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ ధరలు కలుపుకుని ఏకంగా 64శాతం మేర పొందుతున్నాయని, ఇక వాహనదారుడికి మాత్రం అంతర్జాతీయ మార్కట్ ధరల లభ్దిని చేకూర్చకుండా.. వాయింపులను మాత్రం మోయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. సంస్థలు ధరల పెంపుపై వెనక్కు తగ్గడం లేదు. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 140 డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఇదే క్రమంలో వరుసగా పదిహేడు రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి.

గత పదిహేడు రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోల్ ధర ఏకంగా ఎనమిదిన్నర రూపాయలు పెరగ్గా, డీజిల్ పై పది రూపాయల మేర పెరిగింది. ఇక తాజా పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర హైదారాబాదులో ఏకంగా రూ.82.79 దాటగా, అమరావతిలో ఏకంగా రూ.82కి చేరింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇక ఇటీవలే ఇంధన సంస్థలు కూడా తమకు ఇంధన రవాణాలో లీటరుకు ఎనమిది రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తున్నామని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరి.. నష్టాలను భర్తీ చేసుకున్న క్రమంలోనూ ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి.

ఇటు పెట్రోల్ తో పాటు ఆటు డీజీల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు కూడా పెరుగుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, గత పదిహేడు రోజూలుగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలతో పోల్చితే గత నెలలో ఇంధన ధరల వినియోగం పెరిగిందని, గత నెలలో ఏకంగా రెట్టింపు వినియోగం అయ్యిందని దేశ అతిపెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా పదిహేడవ రోజూ ధరలు పెరిగాయి. తాజాగా ఇవాళ మంగళవారం నాడు లీటరు పెట్రోలుపై 20 పైసలు, లీటరు డీజిల్ పై 55 పైసల ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. 

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ.79.76 పైసలు మరియు డీజిల్ ధర రూ. 79.40 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.86.54కి, డీజిల్‌ 77.76 పైసలకు, కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.81.45, డీజిల్ ధర రూ. 74.63కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 83.04 డీజిల్ రూ. 76.77కు పెరుగగా, హైదరాబాద్‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.82.79కు, డీజిల్ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.77.60కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.83.15కు చేరింది. డీజిల్‌ ధర కూడా 51 పైసలు పెరుగుదలతో రూ.77.76కు ఎగసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles