కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ ఆంక్షల నుంచి తొలిసారిగా దేశంలోని జనజీవనం ప్రారంభమైంది ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కదం తోక్కుతోంది. దీంతో కేంద్రప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రమే ఆఫీసులకు రావాలని ఆదేశించింది. మిగతావాళ్లు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది.
దీనికి తోడు కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పని చేయాలని స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావొద్దని సూచించింది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు రావాలని పేర్కొంది. ఎదురెదురుగా కూర్చోవడాన్ని నిషేధించిన కేంద్రం, ఇంటర్కాంలోనే మాట్లాడుకోవాలని ఆదేశించింది. మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పనిసరి గా పెట్టుకోవాలని ఆదేశించిన కేంద్రం, మాస్క్ పెట్టుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని సూచించింది.
కార్యాలయాల కామన్ ఏరియాలో గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. ఎవరికి వారు తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తోడ్పడాలని సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరిగింది. దేశంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాజిటివ్ కేసులు వస్తున్నా యి. నీతి ఆయోగ్ ఆఫీసు, జాతీయ మీడియా కేంద్రాల్లో పని చేసే సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో ఆఫీసులకు రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more